
నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి
బోయినపల్లి(చొప్పదండి): మిడ్మానేరు నిర్వాసితుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ముంపు గ్రామాల ఐఖ్యవేదిక అధ్యక్షుడు కూస రవీందర్ కోరారు. ఈమేరకు కొదురుపాక, నీలోజిపల్లి గ్రామాల నిర్వాసితులతో కలిసి సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే ఈనెల 20, 21వ తేదీలలో నిర్వాసితులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్కుమార్ఝాతో మాట్లాడినట్లు రవీందర్ తెలిపారు. బొలుమాల శంకర్, నాగుల వంశీ, శాలివాహన శ్రీనివాస్, గొట్ల వెంకటేశం, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సోషలిస్టు భావాలు విస్తృత పరచాలి
● సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు
సిరిసిల్లటౌన్: దేశంలో సోషలిస్టు భావాలు విస్తృత పరచాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.స్కైలాబ్బాబు కోరారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన సీపీఎం రాజ కీయ శిక్షణ శిబిరంలో మాట్లాడారు. దేశంలో బీజేపీ పాలనలో పేదరికం పెరిగిపోతుందన్నారు. ప్రజల్లో ఆర్థిక అసమానతలు తొలగినప్పుడే దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్, నాయకులు మల్లారపు అరుణ్కుమార్, ఎగమంటి ఎల్లారెడ్డి, జువ్వాజి విమల, కోడం రమణ, ఎరవెల్లి నాగరాజు, సూరం పద్మ పాల్గొన్నారు.
అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
సిరిసిల్లకల్చరల్: అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్లో ఏడాది శిక్షణకు అర్హులైన ఎస్సీ లా పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీడీవో బి.రాజమనోహర్రావు సోమవారం ప్రకటనలో కోరారు. జూలై 31లోపు తమ ప్రతిపాదనలను http://telanganaepass. cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. హార్డ్కాపీలను జిల్లా ఎస్సీడీవో కార్యాలయంలో గడువులోపు అందజేయాలని తెలిపారు.
19, 26, 27 తేదీల్లో సదరం శిబిరాలు
సిరిసిల్ల: జిల్లా జనరల్ ఆస్పత్రిలో జూన్ 19, 26, 27, జూలై 2వ తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ లక్ష్మీనారాయణ సోమవారం తెలిపారు. జూన్ 19న ఆర్థో, 26న కంటిచూపు, వినికిడి, 27న మానసిక ఆరోగ్యంపై శిబిరం ఉంటుందని వివరించారు. జూలై 2న మరోసారి ఆర్థో శిబిరం ఉంటుందని తెలిపారు. దివ్యాంగులు సంబంధిత మెడికల్ డాక్యుమెంట్లు, ఎక్స్–రే, యూడీఐడీ అప్లికేషన్ ఫామ్, ఆధార్కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో, ఫోన్ నంబర్ వెంట తెచ్చుకోవాలని సూచించారు.
21న యోగా దినోత్సవం
సిరిసిల్లటౌన్: అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈనెల 21న సిరిసిల్లలో నిర్వహిస్తున్నట్లు తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎలిగేటి కృష్ణ తెలిపారు. యోగా డే వేడుకల కరపత్రాలను సోమవారం ఇందిరాపార్కులో ఆవిష్కరించారు. అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల నారాయణ, ఆంకారపు రవి, బిళ్ల శ్రీకాంత్, ఎర్రగుంట మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల
సిరిసిల్ల ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్లో ఫెయిలైన విద్యార్థుల కోసం విద్యాశాఖ నిర్వహించిన అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. ఫస్టియర్లో 2,376 మంది హాజరుకాగా 1,419 ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్లో 1,483 మంది హాజరుకాగా 778 మంది ఉత్తీర్ణత సాధించారు.

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి

నిర్వాసితుల సమస్యలు పరిష్కరించండి