
కాంగ్రెస్తో అన్నివర్గాలకు న్యాయం
● రాజన్నను దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
వేములవాడ: కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్కుమార్ పేర్కొన్నారు. వేములవాడ రాజన్నను సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు మంత్రికి పూర్ణకుంభకలశంతో స్వాగతం పలికారు. కల్యాణ మండపంలో ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారం చేపట్టిన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, సన్నబియ్యం, రికార్డు స్థాయిలో రేషన్ కార్డుల పంపిణీ, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, 59వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.