
76,974 మంది రైతులకు రూ.43.22 కోట్లు
సిరిసిల్ల: జిల్లాలోని 76,974 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.43.22 కోట్ల రైతు భరోసా సొమ్ము మంగళవారం జమయిందని కలెక్టర్ సందీప్కుమార్ ఝా తెలిపారు. వానాకాలం సాగు కోసం రైతులకు ఉపయోగపడేలా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయాన్ని విడుదల చేసిందని పేర్కొన్నారు. అలాగే వేములవాడ పట్టణంలోరోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న బాధితులకు కలెక్టరేట్లో పరిహారం చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 150 మంది నిర్వాసితులకు పరిహారం చెక్కులు అందజేశామని, మిగతావారు కూడా పరిహారం తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారని కలెక్టర్ వివరించారు. నిర్వాసితుల అందరికీ పరిహారం చెక్కులు అందిస్తామని వేములవాడ ఆర్డీవో రాధాబాయి తెలిపారు.
విద్యార్థుల సంఖ్య పెంచాలి
బోయినపల్లి(చొప్పదండి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో ఎస్.వినోద్ పేర్కొన్నారు. మండలంలోని వరదవెల్లి హై స్కూల్ను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలో విద్యార్థుల సంఖ్య త క్కువగా ఉందని పెంచాలని కోరారు. ప్రభు త్వ బడుల్లో నాణ్యమైన విద్య అందుతుందనే విషయం ప్రజలకు చెప్పాలన్నారు. హెచ్ఎం రాములు, ఉపాధ్యాయులు ఉన్నారు.
సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ శిక్షణ తరగతులు
సిరిసిల్లకల్చరల్: బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్లో 150 మంది అభ్యర్థులకు సివిల్ సర్వీసెస్ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి బి.రాజమనోహర్రావు ప్రకటనలో తెలిపారు. జూలై 12న నిర్వహించే అర్హత పరీక్షలో ప్రతిభ చూపిన 100 మంది అభ్యర్థులతో పాటు మరో 50 మందిని గతంలో సివిల్స్ ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేస్తామన్నారు. జూలై 8లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎంపికై న వారికి ఉచిత వసతి, బోర్డింగ్తో పాటు రవాణ భత్యంగా రూ.5వేలు, స్టైఫండ్గా మరో రూ.5వేలు అందజేస్తామన్నారు. www.tgbcstudy circle.cgg.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. మరింత సమాచారం కోసం 040–24071178 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీని వినియోగించుకోవాలి
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల నుంచి పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని ఆర్టీసీ డిపో మేనేజర్ ఎ.ప్రకాశ్రావు తెలిపారు. ఈ నెల 27న ఆషాఢమాసం సందర్భంగా డీలక్స్ బస్సులో సిరిసిల్ల నుంచి మానసాదేవి ఆలయం, కొమురవెల్లి, కొండపోచమ్మ, యాదాద్రి, స్వర్ణగిరి ఆలయాల దైవదర్శనం ఉంటుందన్నారు. బస్సు శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం సాయంత్రం చేరుకుంటుందని, ఒక్కో ప్రయాణికుడికి రూ.670 టికెట్ ధర ఉంటుందని వివరించారు. ఆసక్తి గలవారు 90634 03971, 73828 50616 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
సిరిసిల్లకల్చరల్: గ్వాలియర్లోని లక్ష్మీబాయి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో వచ్చే విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపిక పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అధికారి అజ్మీర రాందాస్ తెలిపారు. పీజీడీఎస్సీ, పీజీడీఎస్ఎస్సీ, డీఎస్సీ, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిట్నెస్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్స్ట్రెంత్, స్పోర్ట్స్ కండిషనింగ్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల క్రీడాకారులు www.lnipe.edu.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 94402 39783 నంబర్లో సంప్రదించాలని సూచించారు.

76,974 మంది రైతులకు రూ.43.22 కోట్లు