
ఆయిల్పామ్పై ఆసక్తి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తక్కువ నీరు.. ఎక్కువ దిగుబడి.. అత్యధిక సబ్సిడీలు ఆయిల్పామ్సాగుపై ఆసక్తి పెంచుతోంది. ఒక్కసారి నాటితే ముప్పై ఏళ్ల వరకు దిగుబడి వచ్చే పంట కావడంతో జిల్లా రైతులు ముందుకొస్తున్నారు. రైతుల ఆసక్తిని గమనించిన హార్టికల్చర్, వ్యవసాయశాఖల అధికారులు వారిని ప్రోత్సహిస్తూ సాగువైపు అడుగులు వేయిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 726 మంది రైతులు 2,189 ఎకరాల్లో ఆయిల్పామ్ను 2022–23 మధ్యలో సాగు చేశారు. ఈ పంటలను గమనించిన చుట్టుపక్కల రైతులు ఈయేడు సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
మండలాల్లో కలెక్షన్ సెంటర్లు
రైతులు సాగుచేసిన పంటను విక్రయించేందుకు ఇ బ్బందులు పడకుండా ఉండేందుకు అధికారులు మ ండలాల్లో కలెక్షన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పంట కోసిన తర్వాత మండలంలోని కలెక్షన్ సెంటర్ వర కు తీసుకెళ్లే బాధ్యత రైతుపై ఉంటుంది. అక్కడి నుంచి ఫ్యాక్టరీకి కలెక్షన్ సెంటర్ నిర్వాహకులే తీసుకెళ్తారు. ఈ రవాణా ఖర్చులు కూడా రైతుల నుంచి వ సూలు చేయరు. ప్రస్తుతం మార్కెట్లో ఒక టన్ను ఆ యిల్పామ్కు రూ.21వేలు పలుకుతుంది. పంటను ఫ్యాక్టరీకి తరలించిన తర్వాత మూడు పనిదినాల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి.
సాగు ఖర్చు ఇలా..
రైతుల ఆసక్తిని బట్టి ఎంత విస్తీర్ణంలోనైనా సాగుచేసుకోవచ్చు. దీనికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ ఇ స్తుంది. ఒక ఎకరంలో 50 మొక్కలు నాటాల్సి ఉంటుంది. 50 మొక్కలకు సబ్సిడీ లేకుండా రూ.9,600 వ్యయం అవుతుంది. సబ్సిడీ వస్తుండడంతో రైతు కేవలం రూ.వెయ్యి చెల్లిస్తే ఎకరంలో 50 మొక్కలు నాటుకోవచ్చు. డ్రిప్ సిస్టమ్, ఇతర ప రికరాలు ప్రభుత్వమే 90 శాతం సబ్సిడీపై అంది స్తుంది. బిందుసేద్యం ద్వారా నీరు అందుతుంది కాబట్టి ఎకరం వరిపంట పండించే నీటితోనే ఐదెకరాల్లో ఆయిల్పామ్ సాగుచేయవచ్చు. అంతరపంటగా వరి కాకుండా మిగతా పంటలు సాగుచేసుకోవచ్చు. ఇలా మొదటి మూడేళ్ల వరకు అంతరపంటలు సాగుచేసి ఆదాయం పొందవచ్చు.
పెరుగుతున్న సాగువిస్తీర్ణం
జిల్లాలో 726 మంది రైతులు 2,189 ఎకరాల్లో సాగు
రెండేళ్ల క్రితం ముందుకొచ్చిన రైతులు
ఈ ఏుడాది చేతికి రానున్న పంట
తక్కువ ఖర్చు.. అధిక దిగుబడి
టన్నుకు రూ.21వేలు పలుకుతున్న ధర