
కొనసాగుతున్న కూల్చివేతలు
వేములవాడ: వేములవాడలో రోడ్ల వెడల్పు ప్రక్రియ మంగళవారం కొనసాగింది. అధునాతన మిషన్లతో 80 ఫీట్ల వరకున్న దుకాణాలను కూల్చివేశారు. యుద్ధప్రాతిపదికన జరుగుతున్న ఈ పనుల్లో 10 మంది తహసీల్దార్లు బృందాలుగా ఏర్పడి ఒక్కో బృందం ఒక్కో బిట్ను పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. ఇక దుకాణదారులు తమ సామగ్రిని సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వీటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు
వేములవాడ పట్టణాభివృద్ధికి మున్సిపల్శాఖ నుంచి వీటీడీఏకు రూ.25 కోట్లు మంజూరు చేసినట్లు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. రాజన్న ఆలయం, పట్టణాభివృద్ధి సమాంతరంగా చేపడుతామని, వేములవాడను టెంపుల్ సిటీగా మార్చుతామని పేర్కొన్నారు.
విస్తరణ పనులు పరిశీలన
పట్టణంలోని మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు చేపట్టే రోడ్ల విస్తరణ పనులను మంగళవారం ఎస్పీ మహేశ్ బీ గీతే పరిశీలించారు. కూల్చివేతల నేపథ్యంలో 200కు పైగా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ బందోబస్తును పరిశీలించారు. ఆయన వెంట ఏఎస్పీ చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, సీఐలు, ఎస్సైలు ఉన్నారు.