బాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంత?: ఎంపీ విజయసాయిరెడ్డి | Ysrcp Mp Vijayasai Reddy Comments On Purandeswari | Sakshi
Sakshi News home page

బాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంత?: ఎంపీ విజయసాయిరెడ్డి

Oct 13 2023 8:31 PM | Updated on Oct 13 2023 9:13 PM

Ysrcp Mp Vijayasai Reddy Comments On Purandeswari - Sakshi

సాక్షి, నెల్లూరు: చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత టీడీపీ స్వరం మారిందని.. చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ నేతలు డ్రామాలాడుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఆరోగ్యంపై ఎల్లో మీడియా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

‘‘దోమలు, మంచినీళ్లు, ఏసీలు అంటూ ఏదో ఒక డ్రామా చేస్తున్నారు. అమిత్‌షా.. లోకేష్‌ను పిలిచినట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ అడ్వకేట్‌ను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలి’’ అని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.

పురంధేశ్వరిని ఎల్లో లోటస్‌గా అభివర్ణించిన విజయసాయిరెడ్డి.. రాజకీయ కక్ష సాధింపు అంటూ ఆమె తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పూర్తి సాక్ష్యాధారాలతోనే సీఐడీ.. చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు. గతంలో పురంధేశ్వరి భర్తే చంద్రబాబును అవినీతిపరుడన్నారని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు.ఆమె భర్త వెంకటేశ్వరరావు చంద్రబాబుపైన ఒక బుక్ రాశారనే విషయం గుర్తు లేదా..? బాబు అవినీతిలో పురంధేశ్వరి వాటా ఎంతో చెప్పాలన్నారు.
చదవండి: ఆరోగ్యంగా చంద్రబాబు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు: జైళ్ల శాఖ డీఐజీ  

‘‘జిల్లాలోని 8 నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించాం. నియోజకవర్గాల్లోని సమస్యలను తెలుసుకున్నాం. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సమస్యలు తెలుసుకున్నాం. నియోజకవర్గ సమీక్షలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. రాబోవు ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులపై సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకుంటారు’’ అని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement