ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌.. నేడు బీజేపీ నేతల ధర్నా | Telangana BJP Leaders Protest At Indira Park Over Musi Issue | Sakshi
Sakshi News home page

ఇందిరా పార్క్‌ ధర్నా చౌక్‌.. నేడు బీజేపీ నేతల ధర్నా

Oct 25 2024 9:55 AM | Updated on Oct 25 2024 11:09 AM

Telangana BJP Leaders Protest At Indira Park Over Musi Issue

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మూసీ అంశంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు ముందుకు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూసీ ప్రాంత ప్రజలకు మద్దతుగా ఇందిరా పార్క్‌ వద్ద నేడు బీజేపీ నేతలు ధర్నా చేపట్టనున్నారు.

తెలంగాణ బీజేపీ నేతలు రెండు రోజుల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించారు. అనంతరం, వారికి మద్దతుగా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ నేడు ఇందిరా పార్క్‌ వద్ద ధర్నాకు సిద్ధమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. బీజేపీ ధర్నాకు కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ హాజరు కానున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement