
Pulivendula Vontimitta ZPTC Election.. Polling Updates:
మహిళల అడ్డగింతతో.. వెనుదిరిగిన పోలీసులు
వైఎస్సార్ జిల్లా తుమ్మలపల్లి లో వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి ఇంటికి పోలీసులు
ఓటు వేయడానికి రావాలంటూ కోరిన పోలీసులు
‘‘మీరు టీడీపీ వారికే కాపలా.. పోండి’’ అంటూ అడ్డుకున్న మహిళలు
ఉదయం నుంచి టీడీపీ రిగ్గింగ్ కి సహకరిస్తూ ఇప్పుడు అభ్యర్థి ఓటు అంటూ వస్తారా? అని ఆగ్రహం
అసలు ప్రజలనే ఓటు వేయనీయకుండా చేసి ఇక్కడి వచి నీతులు చెప్తారా? అంటూ అడ్డగింత
మహిళల అడ్డగింతతో వెనుతిరిగిన పోలీసులు
ఆ పది మంది టీడీపీ వాళ్లే!
పులివెందుల ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ అరాచకం
పోలింగ్ బూత్ ల నుంచి ఓటర్లను వెనక్కి పంపుతున్న టీడీపీ నేతలు
పోలింగ్ బూత్ లను ఆక్రమించిన టీడీపీ నేతలు.
పోలీసులను అడ్డం పెట్టుకొని రిగ్గింగ్ కు పాల్పడుతున్న వైనం
టీడీపీ అరాచకాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు
ఓన్లీ ఎల్లో మీడియా చానల్స్ ను మాత్రమే పోలింగ్ బూత్ లోకి అనుమతి
పదిమంది టీడీపీ ఓటర్లను క్యూ లైన్లో నిలబెట్టి వీడియోలు తీయిస్తున్న టీడీపీ
ఎన్నిక సక్రమంగా జరిగిందంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం
పులివెందుల-నల్లపురెడ్డి గ్రామానికి చెక్ పోస్ట్
ఓటర్లకు, వైఎస్సార్సీపీ శ్రేణులకు నో ఎంట్రీ
టీడీపీ నాయకుల కార్లు అయితే రైట్ రైట్
ఒంటిమిట్టలో టీడీపీ అరాచకం
కొనరాజుపల్లి కి భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు
10 జీపుల్లో బయట నుండి వచ్చిన టీడీపీ శ్రేణులు
భారీ ఎత్తున రిగ్గింగ్ కోసం ప్రయత్నాలు
ఒంటిమిట్టలో టీడీపీ అరాచకం
గొల్లపల్లి , నరసనగారి పల్లి పోలింగ్ బూత్ హేండ్ ఓవర్ చేసుకున్న టీడీపీ శ్రేణులు
ఓట్లు వేసుకొంటున్న టీడీపీ శ్రేణులు
పోలింగ్ బూతుల నుండి వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటికి లాగేసిన టీడీపీ శ్రేణులు
చోద్యం చూస్తున్న పోలీసులు
టీడీపీ రిగ్గింగ్పై ఆగ్రహజ్వాలలు
పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ రిగ్గింగ్
కనంపల్లిలో వేముల, దుగ్గన్నగారిపల్లి గ్రామాల్లో టీడీపీ ఇష్టారాజ్యం
ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని మహిళల గ్రహం
పోలీసుల కాళ్లు పట్టుకుంటున్న ఓటర్లు
పులివెందుల నల్లగొండు వారి పల్లె లో ఓటర్ల ఆందోళన
ఓటు వెయ్యనివ్వండని పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్న ఓటర్లు
టీడీపీ నేతలు రిగ్గింగ్ చెయ్యడం తో నిజమైన ఓటర్ల ఆందోళన
పోలీసులు కి వేడుకుంటున్న ఓటు హక్కు వినియోగించుకొని దుస్థితి
ఓటరు స్లిప్పులు లాక్కుంటున్న టీడీపీ నేతల పై ఓటర్ల ఆగ్రహం
👉లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు: ఎస్వీ సతీష్రెడ్డి
వేంపల్లిలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి హౌస్ అరెస్ట్
నేడు ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది: ఎస్వీ సతీష్రెడ్డి
లోకేష్ శునకానందం కోసం పోలీసులు పని చేస్తున్నారు
లోకేష్ ఆనందం కోసం చంద్రబాబు ధృతరాష్ట్రుడు అయ్యాడు
ప్రజాస్వాయం అవహేళనకు గురవుతుంటే చంద్రబాబు లోకేష్ ఆనందిస్తున్నారు
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
పులివెందులలో ఉన్న పోలీసులకు ఖాకి చొక్కా వేసుకునే అర్హత లేదు
నేటి పోలింగ్ జరుగుతున్న తీరుతో ప్రజాస్వామ్యం మీద ఆందోళన కలిగిస్తోంది
పరిస్థితి ఈ విధంగా ఉన్నాక పోలింగ్ నిర్వహణ ఎందుకు?
👉పులివెందులలో మహిళా ఓటర్ల ఆవేదన
ఓటేయకుండా అడ్డుకుంటున్నారు
ఇళ్లలోకి దూరి పోలీసులే మమ్మల్ని బెదిరించారు
మీ ఇంట్లో మగవారు ఎటు వెళ్లారంటూ నానా హంగామా చేశారు
ఓటర్ స్లిప్పులను లాక్కున్నారు
ఓటేయడానికి వెళ్లే ఇక అంతే సంగతులు అంటూ హెచ్చరించారు
ఈస్థాయిలో అరాచకం ఎప్పుడూ చూడలేదు
వందల మంది స్థానికేతర రౌడీలు మా ఓట్లను వేస్తున్నారు.
👉పులివెందులలో టీడీపీ ఇష్టారాజ్యం
అన్ని పోలింగ్ బూత్ల్లో రిగ్గింగ్చేస్తున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల చేతిలో నల్లపురెడ్డి పోలింగ్ స్టేషన్
జమ్మలమడుగు నుంచి మనుషుల్ని పిలిపించి రిగ్గింగ్
అందరి ఓట్లు వాళ్లతోనే వేయిస్తున్న పచ్చగూండాలు
👉కనంపల్లిలో గ్రామస్తులను ఓట్లు వేయనివ్వని పోలీసులు
ఓటు వేయనివ్వండంటూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఓటర్లు
ఇతర గ్రామాల వ్యక్తులు వచ్చి ఓట్లు వేస్తున్నారు: స్థానికులు
దగ్గరుండి పోలీసులే రిగ్గింగ్ చేయిస్తున్నారు
బయటి నుంచి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాలకే సపోర్ట్ చేస్తున్న పోలీసులు
👉పులివెందుల మండలం కనంపల్లి గ్రామంలో ఉద్రిక్తత
పోలింగ్ బూత్లకు వెళ్ల నియ్యకుండా అడ్డుకుంటున్న టీడీపీ మూకలు
ఓటు వేయడానికి వెళ్తున్న మహిళ ఓటర్లపై దౌర్జన్యానికి పాల్పడుతున్న టీడీపీ మూకలు
తమ ఓటు హక్కును అడ్డుకోవడానికి మీరెవ్వరు అంటూ పచ్చ మూకలపై తిరగబడ్డ మహిళలు
కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు బయటికి రానివ్వకుండా బెదిరిస్తున్న పోలీసులు
👉నల్లపురెడ్డిపల్లిలో యథేచ్ఛగా రిగ్గింగ్
వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలు
విచ్చలవిడిగా రిగ్గింగ్కు పాల్పడుతున్న టీడీపీ గూండాలు
👉ఆర్. తుమ్మలపల్లిలో అరాచకం
వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని కూడా ఓటు వేయనివ్వని టీడీపీ గూండాలు
ఇప్పటికే గ్రామంలోని రెండు పోలింగ్ బూత్లను స్వాధీనం చేసుకున్న టీడీపీ
వైఎస్సార్సీపీ అభ్యర్థి హేమంత్ని బూత్ దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా కాపలా
ఎస్ఫీకి కాల్ చేసినా కనిపించని ఫలితం
హేమంత్ గన్మెన్ని ఉన్న పళంగా మార్చేసిన అధికారులు
నిన్నటి వరకు ఉన్న గన్మెన్ను తొలగించి మరొకరిని పంపిన అధికారులు
బయటి నుండి వచ్చిన వ్యక్తులతో ఓట్లేయిస్తున్న టీడీపీ నేతలు
టీడీపీ గూండాలకే వత్తాసు పలుకుతున్న పోలీసులు
👉టీడీపీ గూండాల అరాచకాలపై పట్టించుకోని పోలీసులు
పులివెందుల వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డి ఆగ్రహం
దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు
టీడీపీ గూండాలు ఓటర్లను భయపెడుతున్నారు
ఓటర్లపై టీడీపీ గూండాలు దాడులు చేస్తున్నారు
నా ఇంటి చుట్టూ టీడీపీ గూండాలు మోహరించారు
కర్రలు, రాడ్లతో ఓటర్లను భయపెడుతున్నారు
దాడులు చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారు
ఏజెంట్లను పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయడం లేదు
👉ఈ కొత్తపల్లిలో రెండు పోలింగ్ బూత్లను ఆక్రమించిన టీడీపీ నేతలు
ఈ కొత్తపల్లిలో కొనసాగుతున్న టీడీపీ నేతల దౌర్జన్యం
టీడీపీ ఓటర్లను తప్ప మిగతా వారిని ఓటు వేయడానికి అనుమతించని టీడీపీ నేతలు
ఓటు వేయడానికి వెళ్లిన వారిని తిరిగి పంపించేస్తున్న టీడీపీ గుండాలు
నిస్సహాయంగా వెనక్కి తిరిగిపోతున్న ఓటర్లు
ఓటు వేయడానికి ఉదయాన్నే పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళాము
దౌర్జన్యంగా వెనక్కి పంపించేశారు
గతంలో ఎన్నడు బూతులను ఆక్రమించలేదు
పోలింగ్ బూత్ల్లో పులివెందులకు సంబంధించిన వ్యక్తులు లేరు
బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారే పోలింగ్ బూత్ల్లో ఉన్నారు
పోలీసులు వారికే కొమ్ము కాస్తున్నారు
ఒక్క బూత్లో కూడా పోలీసులే లేరు
మా గ్రామాల్లో ఓటు వేయకుండా, పక్క గ్రామంలో బూత్లు మార్చారు
ఎప్పుడు బూతులు మార్చిన దాఖలాలు లేవంటున్న ఓటర్లు
👉పులివెందులలో మీడియాపై దాడికి దిగుతున్న కూటమి నేతలు
పోలింగ్ బూత్ లను ఆక్రమించి ఎవర్నీ గ్రామంలోకి రానివ్వని అల్లరి మూకలు
ఊరి బయటే వాహనాలను తనిఖీ చేసి వెనక్కి పంపుతున్న టీడీపీ మూకలు
ప్రతి గ్రామంలో 300 మందికి పైగా అల్లరి మూకలు
మీడియాను సైతం వదలని టీడీపీ మూకలు
మీడియా ప్రతినిధులను గ్రామం బయటే అడ్డుకుని కెమెరాలు లాక్కుంటున్న వైనం
సాక్షి ప్రతినిధులపై దాడికి దిగిన టీడీపీ గూండాలు
వైఎస్సార్సీపీ ఏజెంట్లను అసలు బూత్ లోపలికి వెళ్లనివ్వని టీడీపీ

👉పులివెందుల, ఒంటిమిట్లలో ప్రజాస్వామ్యం ఖూనీ
పోలింగ్ బూత్ల్లో టీడీపీ గూండాల స్వైర విహారం
వైఎస్సార్సీపీ ఏజెంట్లను బయటకు నెట్టేసిన టీడీపీ గూండాలు
మీడియా ప్రతినిధులపైనా టీడీపీ గూండాల దాడులు
టీడీపీ గూండాల అరాచకాలను పట్టించుకోని పోలీసులు

👉పులివెందులలో టీడీపీ గూండాల దౌర్జన్యం
అచ్చివెల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుక్ను టీడీపీ గూండాలు
ఎర్రిపల్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను అడ్డుకున్న టీడీపీ గూండాలు
టీడీపీ గూండాల అరాచకాలతో గ్రామాల్లో భయాందోళనలు
నిస్సహాయంగా వెనక్కి తిరిగి వెళ్తున్న ఓటర్లు
టీడీపీ గూండాలు దౌర్జన్యంగా వెనక్కి పంపేశారని ఆవేదన
గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదంటున్న ఓటర్లు
పోలింగ్ బూత్ల్లో బయటి వ్యక్తులు ఉన్నారంటున్న ఓటర్లు
ఒక్క పోలింగ్ బూత్లో కూడా పోలీసులు లేరంటున్న ఓటర్లు

👉పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తీవ్ర ఉద్రిక్తతల మధ్య ప్రారంభమైన పోలింగ్
ఎక్కడికక్కడే పోలింగ్ బూత్లను ఆక్రమించుకున్న టీడీపీ మూకలు
వైఎస్సార్సీపీ ఏజెంట్లను రాకుండా అడ్డుకున్న టీడీపీ నేతలు
గ్రామాల్లో కర్రలు పట్టుకుని తిరుగుతున్న పచ్చ మూకలు
👉పులివెందుల మండలం ఎర్రిపల్లిలో ఉద్రిక్తత
పోలింగ్ బూత్ ను ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ మూకలు
పోలీసులను సైతం తరిమేస్తున్న టీడీపీ మూకలు
గ్రామంలో మహిళలపై దాడి.. అసభ్యంగా ప్రవర్తిస్తున్న పచ్చ మూకలు
గ్రామంలో వారు ఓటు వేయకుండా అడ్డుకుంటున్న టీడీపీ

👉పులివెందుల మండలంలో భయానక పరిస్థితులు
వైఎస్సారసీపీ ప్రధాన కార్యదర్శి సతీష్రెడ్డి హౌస్అరెస్ట్
వేంపల్లిలోని తన నివాసంలో గృహ నిర్బంధం చేసిన పోలీసులు
వైఎస్సార్సీపీ నేతల కార్లను ధ్వంసం చేసిన టీడీపీ గూండాలు
మౌన ప్రేక్షక పాత్రలో వందలాది మంది పోలీసులు
గ్రామాల్లో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు

👉ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అరెస్ట్
తెల్లవారుజామున అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇంటికొచ్చి బలవంతంగా అవినాష్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఎన్నికలు జరిపే విధానం ఇదేనా?: అవినాష్రెడ్డి
మా కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు
కేవలం వైఎస్సార్సీపీ ఏజెంట్లను టార్గెట్ చేస్తున్నారు
పోలీసులు గూండాలుగా వ్యవహరిస్తున్నారు
ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు
👉వైఎస్సార్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి మంగళవారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. 14వ తేదీ ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోవివిధ కారణాలతో 28 జెడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉండగా, కోర్టులో కేసుల పేరుతో కేవలం పులివెందుల, ఒంటిమిట్ట స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
👉పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలుపు కోసం వైఎస్సార్సీపీ నేతలపై హత్యాయత్నాలు, దాడులు, అక్రమ కేసుల బనాయింపు మొదలు.. ఎన్ని అడ్డదారులు తొక్కినప్పటికీ టీడీపీ అభ్యర్థికి ఘోర పరాజయం తప్పదని అంతర్గత సర్వేల్లో స్పష్టమవడంతో పెదబాబు, చినబాబు ఇద్దరూ బరితెగించారు. పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జెడ్పీటీసీ ఉప ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకు పథక రచన చేశారు. మంగళవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో సోమవారం కొత్త కుట్రకు తెరతీశారు.
👉ఇప్పటికే అధికారులు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లో తప్పులు ఉన్నాయని అబద్ధం చెబుతూ టీడీపీ నాయకులు, కార్యకర్తల ద్వారా వాటిని సేకరిస్తున్నారు. ఇవ్వని వారి నుంచి బలవంతంగా లాక్కున్నారు. సోమవారం సాయంత్రం వరకు పంపిణీ చేయని ఓటరు స్లిప్పులను అధికారుల నుంచి గంపగుత్తగా టీడీపీ నాయకులు తీసేసుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు, కమలాపురంతోపాటు.. సరిహద్దు జిల్లాల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలను భారీ ఎత్తున రప్పించి పులివెందుల మండలంలో పోలింగ్ బూత్లు ఉన్న గ్రామాల్లో తిష్ట వేయించారు.
👉ఈ ఓటరు స్లిప్పులను టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఇచ్చి దొంగ ఓట్లు వేయించుకోవడానికి కుట్ర చేస్తున్నారు. ఒక గ్రామం పోలింగ్ బూత్ను పక్క గ్రామంలోకి మార్చిన నేపథ్యంలో ఓట్లు వేయడానికి 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి పలు గ్రామాల ఓటర్లు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ క్రమంలో నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, యర్రబల్లె ఓటర్లను మార్గం మధ్యలో పోలీసుల ద్వారా ఆపేసి.. పోలింగ్ బూత్ వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని, ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని చెప్పి అడ్డుకోవాలనే ఎత్తు వేశారు. తద్వారా వారి ఓట్లను కూడా ఇతర ప్రాంతాల నుంచి రప్పించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో దొంగ ఓట్లు వేయించుకోవాలన్నది టీడీపీ నేతల పన్నాగం.