ఆసుపత్రిలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

President Ram Nath Kovind was admitted to a hospital  - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ :  భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్  శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.   ఛాతీలో అసౌకర్యంగా ఉందని  చెప్పడంతో​  సిబ్బంది ఆయనను  వెంటనే  ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్మీ హాస్పిటల్ (ఆర్ అండ్ ఆర్) లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం కోవింద్‌ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. కొన్ని సాధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని హెల్త్‌ బులెటిన్‌లో ఆర్మీ ఆస్పత్రి పేర్కొంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top