‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’ | BRS MLC Kavitha On Telangana Jagruti Celebration | Sakshi
Sakshi News home page

‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’

Jul 27 2025 4:23 PM | Updated on Jul 27 2025 4:40 PM

BRS MLC Kavitha On Telangana Jagruti Celebration

వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్‌ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్‌ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. 

ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement