‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’ | BRS MLC Kavitha On Telangana Jagruti Celebration | Sakshi
Sakshi News home page

‘మా పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు’

Jul 27 2025 4:23 PM | Updated on Jul 27 2025 4:40 PM

BRS MLC Kavitha On Telangana Jagruti Celebration

వరంగల్ : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ యాత్ర హాఫ్‌ సెంచరీ దాటిందని చమత్కరించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు రాణి రుద్రమదేవి పేరు పెట్టాలని కవిత డిమాండ్‌ చేశారు. ఈ రోజు(ఆదివారం. జూలై 27) వరంగల్‌ పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన కవిత.. ‘ఆగస్టు 6 జయశంకర్ సర్ పుట్టినరోజున తెలంగాణ జాగృతి వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తాం. 

ఆగస్టు 6న వరంగల్ లో పెద్దఎత్తున జాగృతి వార్షికోత్సవాలు జరుగుతాయి. ఆ రోజే తెలంగాణ జాగృతి శాఖలను ప్రకటిస్తాం, బీఆర్‌ఎస్‌ పార్టీలో ఎడబాటు లేదు.. తడబాటు లేదు. జాగృతిని బలోపేతం చేయడమే మా లక్ష్యం. అన్ని చోట్ల తెలంగాణ జాగృతిని బలోపేతం చేసేందుకుఉ కార్యచరణ రూపొందిస్తున్నాం’ అని తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement