ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే | BRS MLA Bandla Krishna Mohan Joined In Cogress | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ ఆకర్ష్‌.. కాంగ్రెస్‌లో చేరిన మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Jul 6 2024 1:34 PM | Updated on Jul 6 2024 1:48 PM

BRS MLA Bandla Krishna Mohan Joined In Cogress

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వ ఆపరేషన్‌ ఆకర్ష్‌ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి హస్తం గూటికి చేరారు. సీఎం రేవంత్‌ సమక్షంలో ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

కాగా, తెలంగాణలో చేరికలో విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. తాజాగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హస్తం పార్టీలో​ చేరిపోయారు. దీంతో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల సంఖ్యల 38 నుంచి 31కి పడిపోయింది. అయితే, మరో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నట్టు సమాచారం. వారు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఇక, మరో 19 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే బీఆర్‌ఎస్‌ఎల్పీని హస్తం పార్టీలో విలీనం చేయడానికి అర్హత సాధించినట్టు అవుతుంది.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రతిపక్ష పార్టీల నేతల అధికార పార్టీలోకి జంప్‌ అవుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు బీఆర్‌ఎస్‌ నుంచి ఏడుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. అటు ఎమ్మెల్సీలు కూడా హస్తం గూటికి చేరుకున్నారు. దీంతో, బీఆర్‌ఎస్‌ పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎప్పుడు ఎవరు పార్టీని వీడుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement