
సాక్షి, హైదరాబాద్: నగరంలోని బోరబండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్, నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం నెలకొంది. దీంతో, రాజకీయం వేడెక్కింది.
వివరాల ప్రకారం.. బోరబండ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య లోకల్, నాన్ లోకల్ అంటూ మాటల యుద్ధం జరిగింది. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ వర్గీయులు గొడవకు దిగారు. కాగా, బస్తీ ఎలక్షన్ విషయంలో ఈ ఘర్షణ చెలరేగినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టు సమాచారం.