బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!

BJP Meet To Pick Its Vice President Candidate - Sakshi

సాక్షి, ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ప్రచార హడావిడి దాదాపుగా ముగియవస్తుండడంతో.. ఉపరాష్ట్రపతి ఎన్నికలపై బీజేపీ ఫోకస్‌ పెట్టింది. ఈ మేరకు శనివారం సాయంత్రం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. అనంతరం ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

శనివారం సాయంత్రం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా , బిజెపి అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర కీలక నేతలు హాజరు కానున్నారు. 

ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ , నజ్మా హెప్తుల్లా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top