ఎలిగేడు: ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం క ల్పించేందుకు రహదారుల నిర్మాణం చేపట్టామని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. రాములపల్లి(ర్యాకల్దేవుపల్లి)లోని నాగలింగేశ్వరాలయం నుంచి ముప్పిరితోట మీదుగా ధూళికట్ట వరకు రూ.12కోట్లతో చేపట్టన డబుల్రోడ్డు పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి త్వరతగతిన పూర్తిచేయాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో నాయకులు కోట లాలయ్య, ముత్యం శంకరయ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు


