జ్యోతినగర్: జిల్లాలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా కొంత శాంతించిన సూరీడు గురువారం ఒక్కసారిగా వేడెక్కాడు. కమాన్పూర్లో అత్యధికంగా 44.3 డిగ్రీల సెల్సియస్ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లా అంతటా 40 నుంచి 44.3 డిగ్రీల సెల్సీయస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న వారం రోజులు ఎండ తీవ్రత పెరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. గురువారం సాయంత్రం
ఆరు గంటల వరకు నమోదైన
ఉష్ణోగ్రతల వివరాలు..
మండలం ప్రాంతం కనిష్టం గరిష్టం కమాన్పూర్ కమాన్పూర్ 34.7 44.3 పెద్దపల్లి పెద్దపల్లి 32.8 44.2 పెద్దపల్లి భోజన్నపేట 32.8 44.1 అంతర్గాం ఆకెనపల్లి 36.7 43.9 ధర్మారం ధర్మారం 34.9 43.5 ముత్తారం ముత్తారం 32.4 43.3 రామగుండం రామగుండం 34.6 43.1 ఎలిగేడు ఎలిగేడు 33.0 43.1 పాలకుర్తి ఈసాల తక్కళ్లపల్లి 35.3 42.9 మంథని మంథని 32.2 42.6 శ్రీరాంపూర్ శ్రీరాంపూర్ 32.4 42.6 రామగిరి కల్వచర్ల 32.5 42.4 మంథని ఎక్లాస్పూర్ 32.8 42.3 ఓదెల ఓదెల 32.8 42.1


