విద్యాదీపం
న్యూస్రీల్
నెరవేరనున్న జగనన్న ఆశయం వచ్చే విద్యాసంవత్సరానికి అంతా సిద్ధం ఊపందుకున్న కేంద్రియ విశ్వ విద్యాలయం క్యాంపస్ పనులు రూ.834 కోట్లతో సువిశాల ప్రాంగణంలో భవన నిర్మాణాలు పూర్తవుతున్న అడ్మిన్.అకడమిక్, డైనింగ్, తరగతి భవనాలు
గిరిజనుల
చెంతకు
కన్నెత్తి చూడని రాష్ట్ర మంత్రులు
సోమవారం శ్రీ 19 శ్రీ జనవరి శ్రీ 2026
దత్తిరాజేరు:
గిరిజనుల జీవితాల్లో కాంతులు నింపాలంటే విద్యాదీపమైన కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ నిబంధనల ప్రకారం వారి చెంతనే ఉంచాలన్న కృత నిశ్చయంతో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఉమ్మడి విజయనగరం జిల్లాలో కేంద్రీయ గిరి జన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కృషి చేశారు. కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయానికి 2023 ఆగస్టు 25వ తేదీన అప్పటి, ఇప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసిన చోట శాశ్వత క్యాంపస్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థను ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం సాలూరు పరిధిలో మెంటాడ మండలం చినమేడపల్లి గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం మర్రివలస రెవెన్యూలో 561.88 ఎకరాల విస్తీర్ణంలో సువిశాలమైన ప్రకృతి రమణీయతతో చక్కని ప్రాంతంలో విద్యా సౌరభాలు విరబూయనున్నాయని ఈ ప్రాంత ప్రజలు, విద్యావేత్తలు ఆనందోత్సాహంతో ఉన్నారు.120 అడుగుల వెడల్పు రోడ్ల పనులతో పాటు తరగతి భవనాలు (అకడమిక్ బ్లాక్)పరిపాలన భవనం(అడ్మిన్ బిల్డింగ్) బాలికలు, బాలురు వసతి గృహా లు రానున్న విద్యా సంవత్సరానికి పూర్తి చేయడాని కి జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండడంతో పనులు చకచకా జరుగుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రస్తుతం విజయనగరం శివారు గాజులరేగ వద్ద ఏయూ స్టడీ సెంటర్లో తాత్కాలి కంగా గిరిజన యూనివర్సిటీ కొనసాగుతోంది.
కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయంలో తాగునీరు ఇతరత్రా నీటి అవసరాలను తీర్చేందుకు ఏడు కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ పనులు గత వైఎస్సార్సీపీ హయంలో ప్రారంభమై పూర్తయ్యాయి. అలాగే పైప్లైన్ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయి. మౌలిక వసతుల కల్పనకు నిధులు, రైతుల నుంచి సేకరించిన భూములకు పరిహారం చెల్లింపునకు గత ప్రభుత్వం హయంలోనే రూ. 61.06 కోట్లు మంజూరు చేసి రైతులకు పంపిణీ చేశారు. రూ.16 కోట్లతో అప్రోచ్ రోడ్డుకు డ్రైన్లు, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి గత ప్రభుత్వం మరో రూ.48.61 లక్షలు కేటాయించింది. అప్పటికే ఆ భూముల్లో ఉన్న 220 కేవీ విద్యత్ టవర్లు తొలగించడానికి రూ.12.43 లక్షలు మంజూరు చేయడంతో పనులు తుది దశకు చేరుకున్నాయి.
ఉత్తరాంధ్రకు పెద్దదిక్కు అయిన మాజీ మంత్రి, ప్రస్తుత రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వెనుకబడిన ప్రాంతంలో గిరిజన నియోజకవర్గానికి విద్యాకుసుమం లాంటి వర్సిటీ రావాలని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ని అప్పటి గిరిజన శాఖ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొరతో కలిసి ఒప్పించడంతో నేడు ఉమ్మడి విజయనగరం జిల్లాలో యూనివర్సిటీ నిర్మాణం జరగడం శుభ పరిణామమని పలువురు ప్రశంసిస్తున్నారు.
యూనివర్సిటీ ముఖ ద్వారం గజపతినగరం వైపు రావడంతో జాతీయ రహదారి మీదుగా రాక పోకలు సాగడానికి అప్పటి గపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ చేసిన కృషిని జిల్లా, నియోజకవర్గ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. యూనివర్సిటీకి వైజాగ్, భోగాపురం ఎయిర్ పోర్టులు, కోమటిపల్లి, బొబ్బిలి రైల్వేస్టేషన్లు దగ్గరగా ఉండడంతో పాటు జలరవా ణకు కూడా వైజాగ్ దగ్గర కావడంతో దూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి రావడానికి సులభంగా ఉంటుంది, ఇతర రాష్ట్రాల నుంచి విద్యకోసం ఇక్కడికి వస్తున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలు దగ్గరంగా ఉండడం గమనార్హం.
గిరిజన యూనివర్సిటీ ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని కేంద్ర పాలకులు, అధికారులు ఆరాతీయడం తప్ప రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలవుతున్నా చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రం కన్నెత్తి చూడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి, గిరిజన మంత్రిగా సాలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి కానీ, గజపతినగరం ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ కానీ, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇతర ప్రజాప్రతినిధులు ఎవరూ ఇప్పటికీ ఇక్కడ కాలు మోపక పోవడంతో ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భావి తరాల కోసం జగనన్న మంజూరు చేసిన పనులు చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతుంటే ఇప్పటికై నా పరిశీలన చేయాలని విద్యావేత్తలు కోరుతున్నారు.
విద్యాదీపం
విద్యాదీపం
విద్యాదీపం


