
44 కేజీల గంజాయి స్వాధీనం
పార్వతీపురం రూరల్: రాయగడ నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న 44 కేజీల గంజాయిని పార్వతీపురం పట్టణం శివారు రాయగడ రోడ్డులోని పెట్రోల్బంకు సమీపంలో పట్టుకున్నట్టు పార్వతీపురం పట్టణ సీఐ కె.మురళీధర్ శనివారం తెలిపారు. తమిళనాడు రిజిస్టేషన్తో ఉన్న కారులో ఆరుగురు వ్యక్తులు 44 కేజీల గంజాయిని తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారం మేరకు ఎస్ఐ గోవింద సిబ్బందితో కలిసి దాడిచేశారన్నారు. సుమారు రూ.5లక్షల విలువైన గంజాయితో పాటు ఆరుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నామన్నారు.
పాపం.. దంపతులు..!
● 20 సెంట్ల భూమి కోసం తల్లిదండ్రులను
హతమార్చిన కొడుకు
● కన్నీరుకార్చిన రెల్లివలస గ్రామస్తులు
పూసపాటిరేగ: పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు(55), జయమ్మ(53)ది సన్నకారు రైతు కుటుంబం. తమకున్న 80 సెంట్లు భూమే వారి జీవనాధారం. అందులో నాలుగు రకాల పంటలు సాగుచేస్తూ.. మరోవైపు కూలి పనులు చేస్తూ ఇద్దరు పిల్లలను సాకారు. పిల్లలే సర్వస్వంగా భావించారు. కుమార్తె రాధకు పెళ్లిచేశారు. కుమారుడు రాజశేఖర్ యుక్త వయసుకు రావడంతో మురిసిపోయారు. ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బంది లేదనుకున్నారు. కుమారుడిని కూడా ఓ ఇంటివాడిని చేశారు. జీవితం సాఫీగా సాగిపోతుందనుకున్న సమయంలో ఇద్దరు పిల్లలకు తల్లి అయిన కుమార్తె రాధ అకారణంగా మృతిచెందింది. కుమారుడు వ్యసనాలకు బానిసగా మారాడు. అప్పులపాలయ్యాడు. రాధకు వివాహ సమయంలో ఇచ్చిన 20 సెంట్లు భూమిని లాక్కుని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. దీనిని ప్రశ్నించిన తల్లిదండ్రులను పొలంలోనే శనివారం సాయంత్రం ట్రాక్టర్తో గుద్దించి హతమార్చాడు. ఈ హృదయ విదారక ఘటనతో రెల్లివలస గ్రామస్తులు కన్నీరుకార్చారు. ఉన్నంతలో గుట్టుగా బతికే దంపతుల పాలిట కన్నకొడుకే యముడయ్యాడంటూ రోదించారు. పొలంలో పడి ఉన్న మృతదేహాలను చూసి ఎంత ఘోరం జరిగిపోయిందంటూ నిట్టూర్చారు.

44 కేజీల గంజాయి స్వాధీనం

44 కేజీల గంజాయి స్వాధీనం