
కిసాన్ డ్రోన్లతో సాగు సులభం
పార్వతీపురం టౌన్:
కిసాన్ డ్రోన్ వినియోగం, ఉపయోగాలపై రైతులకు అవగాహన అవసరమని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అన్నారు. పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం నిర్వహించిన కిసాన్ డ్రోన్ల అవగాహన కార్యక్రమంలో ఆయ న పాల్గొన్నారు. పురుగు మందు పిచికారీలో డ్రోన్లను వినియోగించే తీరును రైతులు, పైలెట్లతో కలిసి వీక్షించారు. జిల్లాకు ఆరు కిసాన్ డ్రోన్లు మంజూరయ్యాయని, రైతులు గ్రూపుగా ఏర్పడి వీటిని కొనుగోలు చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. ఒక్కో యూనిట్ ధర రూ.10 లక్షలు కాగా రూ.8లక్షల వరకు సబ్సిడీ ఉంటుందని, మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. సందేహాల ను కంపెనీల ప్రతినిధులు, బ్యాంకర్లను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కె.రాబర్ట్పాల్ పాల్గొన్నారు.