
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
సీతానగరం: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకునేందుకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో పార్వతీపురం మన్యం జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. జోగింపేట గిరిజన ప్రతిభా (స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్)ఎస్ఓయీ విద్యాలయ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. విద్యార్థులకు ప్రిన్సిపాల్ ధర్మరాజు, సహోపాధ్యాయులు స్వీట్లు తినిపించి అభినందించారు. ఆల్ ఇండియా ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీలో ఎస్.నాథవర్దన్–137, పి.జగదీశ్వరరావు–2,864, ఎస్.అఖిల్–900, ఎ.లోకేష్–6,299, కె.అభిరాం–3,077 ర్యాంకులు సాధించారు.