శ్రీ సాయిలక్ష్మీ టౌన్ షిప్లో ఏజెంట్గా చేరాను. ఇంటి స్థలాల కోసం వీరఘట్టం ప్రాంతంలోని 41 మంది నుంచి సుమారు రూ.60లక్షలు కలెక్షన్ చేసి వారాడ రాజేంద్రనాయుడుకు ఇచ్చాను. నేను కట్టిన ప్రతిపైసాకు రసీదు ఉంది. నన్ను నమ్మి డబ్బులు కట్టిన వారికి నేను ఏం సమాధానం చెప్పాలి. ఇది ఘరానా మోసం. బాధితులకు న్యాయం చేసేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– పిన్నింటి వెంకటరమణ, ఏజెంట్, వీరఘట్టం
మోసంపై ప్రశ్నిస్తే కొడతారా?
నేను మా ప్రాంతంలో నాకు తెలిసిన వారి నుంచి శ్రీ సాయి లక్ష్మీ టౌన్ షిప్లో ఇళ్ల స్థలాల కోసం రూ.కోటి50లక్షలు కట్టించాను. రాజేంద్రనాయుడును నమ్మి ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కడితే ఇంటి స్థలాలు ఇవ్వకపోగా రాక్షసంగా స్తంభానికి కట్టి కొట్టారు. మోసంపై ప్రశ్నిస్తే ఇంత దారుణమా. పోలీసులు స్పందించి మోసం చేసిన వ్యక్తికి కఠిన శిక్ష పడేలా చూడాలి. బాధితులకు న్యాయం చేయాలి.
– శేఖర్, ఏజెంట్, ఎల్.ఎల్.పురం,
పాలకొండ మండలం
●
రూ.60 లక్షలు కట్టించాను