సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

Mar 19 2025 12:56 AM | Updated on Mar 19 2025 12:52 AM

పార్వతీపురం రూరల్‌: పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవాలని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి సూచించారు. జిల్లా పోలీస్‌ కాన్ఫరెన్స్‌హాల్‌లో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్‌ గ్రేవ్‌ కేసులు, మర్డర్‌, ప్రాపర్టీ, వాహనాల దొంగతనం, సీఆర్‌పీసీ కేసులు, మిస్సింగ్‌, చీటింగ్‌, సైబర్‌ నేరాలు, తదితర కేసులపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్లలో నమోదయ్యే కేసుల వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలన్నారు. సీసీ టీఎంఎస్‌లో గ్రేవ్‌ కేసు, నాన్‌గ్రేవ్‌ కేసులో పార్ట్‌–1, పార్ట్‌–2 సీడీలు అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు. హత్య కేసుల్లో అభియోగ పత్రాలను వీలైనంత తొందరగా కోర్టులో దాఖలు చేయాలన్నారు. ఈ కోప్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిఘా పెంచాలన్నారు. అవసరమైతే స్టేషన్‌కు పిలిపించి వారి పూర్తి వివరాలను సేకరించి గాంఢీవం కోర్టులో అప్‌లోడ్‌ చేస్తే నేర చరిత్ర తెలుస్తుందన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను ఎస్పీ అందజేశారు. నేర సమీక్ష సమావేశంలో ఏఎస్పీ అంకిత సురానా, పాలకొండ డీఎస్పీ ఎం.రాంబాబు, ఏఆర్‌ డీఎస్పీ థామస్‌ రెడ్డి, ఎస్‌బీ సీఐ రంగనాథం, డీసీఆర్‌బీ సీఐ ఆదాం, సోషల్‌ మీడియా, సైబర్‌ సెల్‌ సీఐ శ్రీనివాసరావు, సీసీఎస్‌ సీఐ అప్పారావు, ఏఆర్‌ ఆర్‌ఐ రాంబాబు, పలువురు సీఐలు, ఎస్‌ఐలు, ఐఆర్‌ఏడీ శ్రీధర్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ 1
1/1

సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement