పల్నాట పచ్చ పిశాచాలు | - | Sakshi
Sakshi News home page

పల్నాట పచ్చ పిశాచాలు

Feb 26 2026 7:34 AM | Updated on Feb 26 2026 7:34 AM

పల్నా

పల్నాట పచ్చ పిశాచాలు

గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026 పల్నాట పచ్చ పిశాచాలు ఇఫ్తార్‌ సహరి (గురు) (శుక్ర) నరసరావుపేట 6.21 5.12 గుంటూరు 6.19 5.10 బాపట్ల 6.19 5.10 పిడుగురాళ్లరూరల్‌: గురజాల నియోజకవర్గంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా వరుస దాడులకు పాల్పడుతున్నారు. పోలీసులు టీడీపీ గూండాలకు కొమ్ముకాస్తున్నారు. బాధితులపై కేసులు నమోదు చేస్తూ ‘పచ్చ’పాతం చూపుతున్నారు. గురజాల నియోజకవర్గం పరిధిలోని మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మందా సాల్మన్‌ను టీడీపీ గూండాలు హత్య చేశారు. అంతేగాక పలువురు నేతలపై దాడులు చేసి కాళ్లు, చేతులు విరగగొట్టారు. ఇప్పటికీ వారు మంచానికే పరిమితమయ్యారు. దాడిలో కీలక వ్యక్తులు వీరే... జూలకల్లు గ్రామంలో వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడి చేసిన వారిలో టీడీపీకి చెందిన సామేలు, దాదా సాహెబ్‌, మోసేజు, సింహాద్రి, చల్లా రాజేష్‌, వీరయ్య కీలకంగా ఉన్నారు. వారిపై ఇప్పటి వరకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసుల అండ చూసుకొని వారు మరింత రెచ్చిపోతున్నారు. బాధితులపైనే కేసులు టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి స్టేట్‌మెంట్‌ రాసుకుని కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. దాడి చేసిన వ్యక్తుల పేర్లతో సహా తెలుపుతూ బాధితులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయడం లేదు. దాడులు చేసిన వ్యక్తులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తే గ్రామంలో ఇలాంటి దారుణాలు మళ్లీ జరగవని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు.

గురజాల నియోజకవర్గంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు

న్యూస్‌రీల్‌

ఒకే గ్రామంలో ఐదుగురిపై దాడులు

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులలో కాళ్లు, చేతులు విరిగి మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. నర్రెడ్డి లక్ష్మారెడ్డి మిరప పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో బీసీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల వద్ద దారికాచి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దాడిలో కాళ్లు, చేతులు విరిగాయి. నర్రెడ్డి వెంకటరెడ్డి పొలం నుంచి తిరిగి వస్తుండగా వెంబడించి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. బీరవల్లి పిచ్చిరెడ్డి ద్విచక్ర వాహనంపై పొలం నుంచి తిరిగి వస్తుండగా బీసీ కాలనీలో కర్రలు, రాడ్లతో దాడి చేశారు. పాశం చిన్న అంజిరెడ్డి సచివాలయం వద్ద కూర్చుని ఉండగా ఎనిమిది మందికిపైగా టీడీపీ గూండాలు చుట్టుముట్టి కాళ్లు, చేతులు విరిగేలా కొట్టారు. గుత్తికొండ గ్రామంలో కూలీలను తన పంట పొలంలో పనిచేసేందుకు పిలిచి తిరిగి జూలకల్లు గ్రామం వస్తుండగా జూలకల్లు అడ్డరోడ్డు వద్ద చల్లా అంజిరెడ్డిని కళ్లల్లో కారం కొట్టి విచక్షణ రహితంగా దాడి చేశారు. దాడిలో అతనికి రెండు కాళ్లు విరిగాయి. సోమవారం అర్ధరాత్రి మొక్కజొన్న కండెలపై పట్టా కప్పేందుకు వెళ్లి వస్తున్న బీరవల్లి రామి రెడ్డిపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఆయన రెండు కాళ్లు, చేతులు విరిగిపోవడంతో కింద పడిపోయాడు.

శ్రీవారి వార్షికోత్సవాలు

పల్నాడు
గురువారం శ్రీ 26 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఇఫ్తార్‌ సహరి (గురు) (శుక్ర) నరసరావుపేట 6.21 5.12 గుంటూరు 6.19 5.10 బాపట్ల 6.19 5.10

వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై

పాశవిక దాడులు

పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

బాధితులపైనే కేసులు నమోదు

దుగ్గిరాల: రైలుపేట కల్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సవాలలో బుధవారం హనుమంతుని హోమం ఘనంగా నిర్వహించారు.

పల్నాట పచ్చ పిశాచాలు1
1/5

పల్నాట పచ్చ పిశాచాలు

పల్నాట పచ్చ పిశాచాలు2
2/5

పల్నాట పచ్చ పిశాచాలు

పల్నాట పచ్చ పిశాచాలు3
3/5

పల్నాట పచ్చ పిశాచాలు

పల్నాట పచ్చ పిశాచాలు4
4/5

పల్నాట పచ్చ పిశాచాలు

పల్నాట పచ్చ పిశాచాలు5
5/5

పల్నాట పచ్చ పిశాచాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement