‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం

Jan 18 2026 6:57 AM | Updated on Jan 18 2026 6:57 AM

‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం

‘వందేమాతరం’ బహుమతుల ప్రదానం

రాయగడ: జాతీయ గేయం వందేమాతరం 150 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు అధికారయంత్రాంగం బహుమతులను ప్రదానం చేసింది. మున్సిపాలిటీ యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక బిజూపట్నాయక్‌ అడిటోరియంలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్‌ నవీన్‌ చంద్ర నాయక్‌, గౌరవ అతిథిగా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌ చంద్రకాంత్‌ మాఝిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్తుల మధ్య నిర్వహించిన వక్‌ృత్వ, చిత్రలేఖనం, వందేమాతరం గానం తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు అతిథులు బహుమతులను అందజేశారు. అనంతరం నవీన్‌ నాయక్‌ మాట్లాడుతూ.. దేశ సమైక్యతకు అద్దం పట్టే ఈ గానంలో మాధుర్యం ఎంతో నిండిఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మహేష్‌ కుమార్‌ పట్నాయక్‌, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్‌ కుమార్‌, జిల్లా సాంస్కృతిక విభాగం అధికారి సుస్మిత బౌరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement