ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

Jan 17 2026 7:38 AM | Updated on Jan 17 2026 7:38 AM

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలి

రాయగడ: పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి, వినాయక స్వామి విగ్రహాలను విరగొట్టిన అదే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న కె.కృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని భజరంగదళ్‌, విశ్వహిందు పరిషత్‌లకు చెందిన కార్యకర్తలు కోరారు. ఈ మేరకు కలెక్టర్‌ అశుతోస్‌ కులకర్ణి, ఎస్పీ స్వాతి ఎస్‌.కుమార్‌లకు వినతిపత్రాలు శుక్రవారం అందజేశారు. జిల్లాలో మునిగుడ సమితి అంబొదలలోని ప్రభుత్వ ఉన్నత మాధ్యమిక పాఠశాలలో ఈనెల 15వ తేదీన ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. వినతిపత్రం అందజేసినవారిలో విశ్వ హిందూ పరిషత్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఆనందరావు, కార్యదర్శి రమేష్‌ కున, సహ కార్యదర్శి గోపి బ్రహ్మ, రంజన్‌ స్వాయి తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement