క్రీడలతో మానసిక ఉల్లాసం | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో మానసిక ఉల్లాసం

Jan 9 2026 7:16 AM | Updated on Jan 9 2026 7:16 AM

క్రీడలతో మానసిక ఉల్లాసం

క్రీడలతో మానసిక ఉల్లాసం

రాయగడ: క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని జేకేపూర్‌లో గల జేకే పేపర్‌ మిల్‌ ఎగ్జిక్యూటీవ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వినయ్‌ ద్వివేది అన్నారు. గురువారం జేకేపేపర్‌ మిల్‌ మైదానంలో పేపర్‌ మిల్స్‌ యూనిట్ల మధ్య ఇంటర్‌ యూనిట్స్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నామెంట్‌ ప్రారంభమైంది. ఈ టోర్నీకి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన క్రీడాకారులను ప్రోత్సాహించారు. క్రీడలు మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ టోర్నీలో జేకేపేపర్‌ మిల్‌ (రాయగడ), పొన్‌ఘద్‌లో గల సెంట్రల్‌ పల్ప్‌ యూనిట్‌, సిరిపూర్‌ పేపర్‌ మిల్‌, కాగజ్‌నగర్‌ ఢిల్లీలకు చెందిన జట్ల మధ్య ఈ నెల 11 వ తేదీ వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ప్రారంభోత్సవ అనంతరం సిరిపూర్‌ పేపర్‌ మిల్‌, జేకేపేపర్‌ మిల్స్‌ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో జేకేపేపర్‌ మిల్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసింది. 20 ఓవర్ల పరిమితి గల ఈ మ్యాచ్‌లో జేకే పేపర్‌ మిల్‌ జట్టు 184 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సిరపుర్‌ జట్టు 19.1 ఓవర్లలో 76 పరుగులకు అలౌట్‌ అయింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను జేకేపేపర్‌ మిల్‌ జట్టుకు చెందిన మహమ్మద్‌ అభిషేష్‌కు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement