ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లాస్థాయి మాల్యవంత్ మహోత్సవం
మల్కన్గిరి: మల్కన్గిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా కలెక్టర్ సోమేశ్ ఉపాధ్యాయ్ నిర్వహించిన సమావేశంలో డిసెంబర్ నెలలో జరగవలసిన మాల్యవంత ఉత్సవాలు అనివార్య కారణాలతో జరగలేదు. ఈ ఉత్సవాలను ఫిబ్రవరి ఒకటి నుంచి 5వ తేదీ వరకు జరుపాలని నిర్ణయించారు. ఉత్సవానికి అందరూ. సహకరిచాలని కలెక్టర్ సోమేశ్ కోరారు. జిల్లా సంస్కృతి అధికారి సంత్రాన నారాయణ పండా, జిల్లా ఎస్పీ వినోద్ పటేల్, జిల్లా అదనపు కలెక్టర్ సోమనాఽథ్ ప్రధాన్ , మల్కన్గిరి జిల్లా అదనపు ఎస్పి ఆర్కే దాస్, చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో ప్రతినిధి గోవిందపాత్రో, ఇతర ఉద్యోగులు అధికారులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లాస్థాయి మాల్యవంత్ మహోత్సవం


