
29, 30 తేదీల్లో చందనోత్సవాలు
రాయగడ: జిల్లాలోని కొలనార సమితి పరిధిలో గల అమలాభట్టకు సమీపంలో ఉన్న శ్రీక్షేత్ర టౌన్షిప్లో కొలువై ఉన్న శ్రీలక్ష్మీ నృసింహ ఆలయంలో ఈ నెల 29, 30వ తేదీల్లో అక్షయ తృతీయను పురస్కరించుకుని చందనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్త దూడల శ్రీనివాస్ తెలియజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు మంగనాథ్ ఆచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా 30న ఉదయం ఏడు గంటలకు చందనాభిషేకం, తీర్థ ప్రసాద సేవ కార్యక్రమాలు అలాగే సాయంత్రం 6 గంటల నుంచి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవాలు జరుగుతాయి.

29, 30 తేదీల్లో చందనోత్సవాలు