సఫాయి కార్మికుడు మృతి
మల్కన్గిరి: జిల్లా కేంద్రంలో మల్కన్గిరిలో నివాసముంటున్న సఫాయి కార్మికుడు డోంబురు గరడ (55) గుండెపోటుతో సోమవారం వేకువజామున మృతిచెందాడు. ఇతనికి వివాహం కాలేదు. మల్కన్గిరి జిల్లా ఆస్పత్రిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరెంట్ కూడా లేని ఓ చిన్న ఇంట్లో నివాసముంటున్నాడు. మృతి సమాచారం తెలిసి హాజరైన బంధువులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ బ్యాగు నిండా నోట్ల కట్టలు కనిపించాయి. కొంత బంగారం కూడా గుర్తించారు.
● ఇంట్లో వెలుగు చూసిన నోట్ల కట్టలు
సఫాయి కార్మికుడు మృతి


