● దొండనచో దీక్షలు ప్రారంభం

ఎండలో రోడ్డుపై పడుకొని దీక్ష కొనసాగిస్తున్న భక్తులు   - Sakshi

చైత్రమాసం ప్రవేశంతో గంజాం జిల్లాలో ప్రసిద్ధి చెందిన దండనచో దీక్షలు భక్తిశ్రద్ధలతో ఫ్రారంభమయ్యాయి. ఆది, సోమవారాల్లో నగరంలోని గాంధీనగర్‌, హరడాఖండి, సిటీ హాస్పిటల్‌ రోడ్డు, పాడు వీధుల్లో దొండనచో బృందాల దీక్షాధారుల ప్రదర్శనలు జరిగాయి. సంప్రదాయాలకు అనుగుణంగా మిట్ట మధ్యాహ్నం ఎండలో కఠోర దీక్షలు, గడ్డి ఉండలతో అగ్నికీలల ప్రదర్శనలు చేపట్టారు. ఉదయమంతా ఉపవాసం ఉన్న దీక్షాధారులు సాయంత్రం చెరువుల్లో స్నానం చేసిన అనంతరం ప్రసాద స్వీకరించారు. దొండకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. –బరంపురం

Read latest Orissa News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top