విదేశీ పర్యటన విజయవంతంగా ముగించుకుని బుధవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసానికి చేరుకున్న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, ఎమ్మెల్సీలు కల్పలత, రుహుల్లా, మాజీ మంత్రి వెలంపల్లి, మాజీ ఎమ్మెల్యేలు విష్ణు, స్వామిదాసు, పార్టీ నేతలు గౌతంరెడ్డి, రాయన భాగ్యలక్ష్మి, ఆసిఫ్, నరేంద్ర ఆయనను కలిసిన వారిలో ఉన్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ


