ఏపీటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

ఏపీటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

May 15 2026 10:50 AM | Updated on May 15 2026 10:50 AM

ఏపీటీఎఫ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ (ఏపీటీఎఫ్‌) కృష్ణా జిల్లా శాఖ నూతన జనరల్‌ కౌన్సిల్‌ సమావేశం కె.శేషగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షుడిగా నడకుదిటి రామబ్రహ్మం (మచిలీపట్నం), అధ్యక్షుడిగా బి.లంకేశ్వరరావు (ఉయ్యూరు), ఉపాధ్యక్షులుగా కె.శేషగిరి (బంటుమిల్లి), పి.భాను ప్రకాశరావు (ఉయ్యూరు), వి.శివరామకష్ణ (పెడన), జె.రూబెన్‌ (గూడూరు), జె.శ్రీనివాసరావు (మచిలీపట్నం) ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా తాతా రేణుకారావు (పెడన), అదనపు కార్యదర్శిగా కె.శ్రీనివాసరావు (కృత్తివెన్ను), కార్యదర్శులుగా వి.నాగమల్లేశ్వరరావు, సి.సంతోష్‌ కుమార్‌, పి.రవిబాబు, డి.జయప్రకాశ్‌, వి.వెంకటేశ్వరరావు, వి.ఎస్‌.వి. సుబ్బారావు, కె.శ్రీను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి మేకల సుబ్బారావు వ్యవహరించారు. సమావేశంలో పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని తీర్మానాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మెమో నెం.57ను రాష్ట్రంలో అమలు చేసి 11 వేల మందికి పాత పెన్షన్‌ వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు జి.సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి తమ్ము నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి.దస్తగిరి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు శుభాకరరావు, ఎన్‌. రామబ్రహ్మం పాల్గొన్నారు.

జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికై న బి.లంకేశ్వరరావు

జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న తాతా రేణుకారావు

Advertisement
 
Advertisement
Advertisement