
నదిలో పడి బీహర్ యువకుడి మృతి
అదుపుతప్పి బోల్తాపడిన టిప్పర్
నస్రుల్లాబాద్: మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో గల ప్రధాన రహదారిపై ఓ టిప్పర్ అదుపు తప్పి సమీప పంట పొలాల్లో బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. నస్రుల్లాబాద్ వైపు నుంచి బైరాపూర్ వైపునకు సోమవారం మొరం తీసుకొని వెళుతున్న టిప్పర్ అదుపుతప్పి పంట పొలాల్లో పడిపోయింది. డ్రైవర్ అప్రమత్తం అవ్వడంతో ఎటువంటి గాయాలు కాలేదు. అధిక లోడ్తో మొరం తరలించడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
తాగుడుకు బానిసై ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలం పడంపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ భూమి వద్ద సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై భువనేశ్వర్ తెలిపారు. మహరాష్ట్రలోని ముద్ఖేడ్ తాలుకా, పుంజ్ ఏక్లార గ్రామానికి చెందిన బోయిల్వాడ్ హన్మంతు(34)కు మండలంలోని పెద్దఎడ్గి గ్రామానికి చెందిన గంగమణితో గతంలో వివాహం జరిగింది. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. మద్యం తాగుడుకు బానిసైన హన్మంతు జీవితంపై విరక్తి చెంది, పంట చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈమేరకు మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రుద్రూర్: మంజీరా నదిలో కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బీహర్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడి మృతి చెందాడు. కోటగిరి ఎస్సై సునీల్ తెలిపిన వివరాలు ఇలా.. బీహార్ రాష్ట్రానికి చెందిన కూలీల బృందం ఇటీవల పోతంగల్ మండలం కల్లూర్ గ్రామానికి వరి నాట్లు వేయడానికి వచ్చింది. వీరిలో రాజేష్ కుమార్ సహాని(32) అనే యువకుడు ఆదివారం సాయంత్రం కాలకృత్యాలు తీర్చుకోడానికి కొడిచర్ల శివారులోని మంజీరా నది వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి నదిలో పడిపోయాడు. వెంటనే స్థానికులు గమనించి అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతుడి సోదరుడు వీరేంద్ర కుమార్ సహాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బైక్ అదుపుతప్పి ఒకరు..
మాక్లూర్: బైక్ అదుపుతప్పి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని దుర్గానగర్కు చెందిన కే శంకర్ (62) తన బైక్పై సోమవారం నిజామాబాద్ బయలుదేరాడు. మాణిక్ బండారు శివారులో అతడి బైక్ అదుపు తప్పడంతో కిందపడి గాయపడ్డాడు. వెంటనే స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు శివకుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజశేఖర్ తెలిపారు.
నగరంలో గుర్తుతెలియని వ్యక్తి..
ఖలీల్వాడి: నగరంలోని బస్డిపో–1 మెయిన్ గేట్ పక్కన ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఒకటో టౌన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపారు. బస్టాండ్ సెక్యూరిటీ సిబ్బంది మృతుడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు జీజీహెచ్కు తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడు ఎరుపు రంగు టీ షర్ట్, గ్రీన్ కలర్ ప్యాంట్ ధరించినట్లు చెప్పారు. అతడి వయస్సు సుమారు 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. మృతుడి సమాచారం ఎవరికై నా తెలిసినచో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో గాని ఫోన్ నంబర్ 87126 59714కు సమాచారం ఇవ్వాలన్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
మాక్లూర్: మండలంలోని కొత్తపల్లి శివారులో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. నవీపేట మండలం జన్నేపల్లికి చెందిన అభిషేక్(28) ఆదివారం తన బైక్పై పని నిమిత్తం నందిపేట వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మండలంలోని కొత్తపల్లి శివారులో అతడిని ట్రాక్టర్ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో అభిషేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అతడు చికిత్స పొందుతూ రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. మాక్లూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నదిలో పడి బీహర్ యువకుడి మృతి

నదిలో పడి బీహర్ యువకుడి మృతి

నదిలో పడి బీహర్ యువకుడి మృతి