
సంక్షిప్తం
మూగ జీవాలకు వ్యాధి నిరోధక టీకాలు
డిచ్పల్లి: పశువైద్య, పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో సోమవారం డిచ్పల్లి మండలం యానంపల్లి గ్రామంలో మూగజీవాలకు వ్యాధి నిరోధక టీకాలు వేసినట్లు మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపికృష్ణ తెలిపారు. తొలకరి జల్లులు కురవడం వల్ల వచ్చే కొత్త గడ్డి తినడం వలన గేదెలలో గొంతు వాపు వ్యాధి, ఆవులలో జబ్బవాపు వ్యాధి, గొర్లలో చిటుకు రోగం వచ్చే అవకాశాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
ధర్పల్లి: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసలై తమ జీవితాలను బలి చేసుకోవద్దని ఎస్సై రామకృష్ణ అన్నారు. మండలంలోని దుబ్బాక గ్రామంలో సోమవారం మాదక ద్రవ్యాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాదకద్రవ్యాలు ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రభావాలపై ప్రజలకు వివరించారు.
ముగ్గురు టీచర్లకు డిప్యుటేషన్
నిజామాబాద్ అర్బన్: నగరంలోని గోల్డెన్ జూబ్లీ పాఠశాలలో ముగ్గురు టీచర్లకు డీఈవో అశోక్ డిప్యుటేషన్ వేశారు. ఈ పాఠశాలలో విద్యార్థులు తక్కువగా టీచర్లు ఎక్కువగా ఉండటంతో ఈ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు చెందిన ఎస్జీటీ అబీదా బేగంను వాల్మీకి నగర్ పాఠశాలకు, యభ్య తాహేర్ను ముజాహిద్నగర్కు డి జయశ్రీని ఖిల్లా ప్రభుత్వ పాఠశాలకు డిప్యుటేషన్పై పంపించారు.
బార్కు జరిమానా
ఖలీల్వాడి: నగరంలోని అర్సపల్లిలో ఉన్న ఎంఎస్ఆర్ బార్ను ఎకై ్సజ్ అధికారులు సోమవారం తనిఖీ చేశారు. బార్లో మద్యాన్ని బయటకు విక్రయించడంతోపాటు మద్యం వివరాలను నమోదు చేయకపోవడంతో జరిమానా విధించినట్లు నిజామాబాద్ ఎకై ్సజ్ ఎస్హెచ్వో దిలీప్ తెలిపారు. నిజామాబాద్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్ మెంట్ సీఐ స్వప్న, సిబ్బంది ఉన్నారు.
ఈదురు గాలులకు షెడ్డు ధ్వంసం
మోపాల్: మండలంలోని ఎల్లమ్మ కుంటలో సోమవారం సాయంత్రం వీచిన బలమైన ఈదురు గాలులకు రేకుల షెడ్డు ఎగిరిపోయింది. గ్రామానికి చెందిన కేతావత్ యాదగిరి గొర్రెల దానా నిల్వ కోసం షెడ్డు నిర్మించాడు. దీని వల్ల సుమారు రూ.12లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు యాదగిరి తెలిపాడు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తాం
నిజామాబాద్ రూరల్: ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ అధ్యక్షతన ఎమ్మెల్యేను టీఎన్జీవోస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. టీఎన్జీవోఎస్ పక్షాన ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో నేతికుంట శేఖర్, పోల శ్రీనివాస్, జాఫర్ హుస్సేన్, జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.