
ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు
నిజామాబాద్నాగారం: ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామీణ స్థాయిలో విస్త్తృతంగా బలోపేతం చేయడానికి జిల్లాలో ఈనెల చివరిలోపు గ్రామీణ, మండల స్థాయిలో ఎన్నికలు నిర్వహించేందుకు కమిటీలను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీపీ, ఆలిండియా బంజారా సేవా సంఘం జిల్లా నాయకుడు కేతావత్ యా దగిరి పేర్కొన్నారు. సోమవారం నగరంలోని ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గ్రామీణ,మండల స్థాయిలో కమిటీల పూర్తయిన తర్వాత జిల్లా స్థాయిలో నిర్వహిస్తా మని అన్నారు. సమావేశంలో బాబురావు నాయక్,లక్ష్మణ్ నాయక్,వెంకట్రామ్ నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
పోస్టర్ల ఆవిష్కరణ
సిరికొండ: మండలంలోని గడ్కోల్లో టీయూసీఐ జిల్లా మహాసభల వాల్ పోస్టర్లను సోమవారం నాయకులు ఆవిష్కరించారు. ఈ నెల 19న సిరికొండలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలన్నారు. నాయకులు రామకృష్ణ, కిశోర్, లింబాద్రి, నారాగౌడ్, రాములు, కిరణ్, అనీస్ తదితరులు పాల్గొన్నారు.
సొసైటీ చైర్మన్కు పరామర్శ
సిరికొండ: మండలంలోని తూంపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాములునాయక్ను డీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్కోల్ భాస్కర్రెడ్డి సోమవారం పరామర్శించారు. చైర్మన్ మనవడు ఇటీవల మృతి చెందాడు. చైర్మన్ను, ఆయన కుమారుడు రఘును ఓదార్చారు. రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్, రాంచందర్రెడ్డి, లక్ష్మణ్, మోజీరాం, గౌసొద్దీన్, ఆకుల జగన్, సంతోష్నాయక్, జీవన్నాయక్, బుచ్చన్న, శ్రీధర్, కిశోర్గౌడ్ తదితరులు ఉన్నారు.
ఆర్థికసాయం అందజేత
నిజామాబాద్ నాగారం: నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన భాగ్యలక్ష్మి కుమార్తె అనారోగ్యానికి గురికాగా శ్రీలక్ష్మీ చేయూత సేవా సమితి సభ్యులు ఆదివారం రాత్రి రూ. పదివేల ఆర్థికసాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో సేవా సమితి అ ధ్యక్షుడు బంగారి శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీనివాస్, సీహెచ్ భూషణ్చారి, వేణుగోపాల్రావు, రవీందర్, శ్యామ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మత్తుపదార్థాలకు
దూరంగా ఉండాలి
ఖలీల్వాడి:యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్సై గంగాధర్ సూచించారు. నగరంలోని నాగారం, వర్ని చౌరస్తా లో మత్తు పదార్థాలు, గంజాయి వంటి వాటిపై స్థానికులకు,యువతకు అవగాహన కల్పించారు. కాలనీవాసులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
సుజుకి యాక్సెస్
కొత్త వాహనం ఆవిష్కరణ
ఖలీల్వాడి: నగరంలోని ప్రగతినగర్లో ఉన్న సారంగ సుజుకి షోరూంలో సోమవారం సుజుకి యాక్సెస్ 125 ఆర్సీటీఎఫ్టీ అనే కొత్త మోడల్ వాహనాన్ని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిరణ్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ సోమానీ, జనరల్ మేనేజర్ ముప్పెడ నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
తీర్మాన పత్రాలపై సంతకాలు పెట్టకుండా ఇబ్బందులు
మోపాల్: ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా గేదెలు, గొర్రెల షెడ్డు మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు తీర్మాన పత్రాలపై సంతకాలు పెట్టకుండా ఎంపీడీవో, జీపీ కార్యదర్శి ఇబ్బందులకు గురి చేస్తున్నారని బైరాపూర్ పాడి రైతులు ఆరోపించారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదుచేశారు. పాడి రైతులు జలంధర్, బి లాలు, ప్రవీణ్, రామా, కిరణ్కుమార్, పీర్సింగ్, నరేందర్, గమీరా బాయి, రాజు, తదితరులు పాల్గొన్నారు.

ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు

ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు

ఆలిండియా బంజారా సేవా సంఘం గ్రామ కమిటీల ఏర్పాటు