అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు | - | Sakshi
Sakshi News home page

అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

Apr 14 2025 12:20 AM | Updated on Apr 14 2025 12:20 AM

అలరిం

అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

కుంటాల: మండల కేంద్రంలోని ఉమామహేశ్వర ఆ లయ ఆవరణలో ఆదివారం నిర్వహించిన కుస్తీ పో టీలు అలరించాయి. తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి మల్లయోధులు పోటీలో తలపడ్డారు. సుమారు 60 కుస్తీలు నిర్వహించారు. మహారాష్ట్రలోని కర్కెల్లి గ్రామానికి చెందిన గణేశ్‌ ఒంటి చేతితో ముగ్గురిని ఓడించి ప్రత్యేకత చాటుకున్నాడు. మహా రాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా ఉమ్రి తాలూకాలోని బిద్రెల్లికి చెందిన సాయినాథ్‌ విజేతగా నిలిచాడు. ఈయనకు గ్రామస్తులు రూ.5,100 నగదు, వెండి కడి యం, కొబ్బరికాయ అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా అర్చకుడు జంగం మధు ఆధ్వర్యంలో గ్రామస్తులకు అంబలి పంపిణీ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పా టు చేశారు. స్థానిక ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు1
1/1

అలరించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement