
మాజీ కమిషనర్కు పరామర్శ
నిర్మల్టౌన్: ఉద్యానవన శాఖ రాష్ట్ర మాజీ కమిషనర్ లోక వెంకట్రాంరెడ్డిని మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు జిల్లాకు చెందిన నేతలు శనివారం పరామర్శించారు. వెంకట్రాంరెడ్డి కొన్ని రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు. దీంతో ఆయనను జిల్లా నాయకులు హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరా మర్శించారు. నిర్మల్ జిల్లాకే చెందిన వెంకట్రాంరెడ్డి రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్గా పనిచేసిన సమయంలో జిల్లా రైతులకు విశేష సేవలు అందించారని ఇంద్రకరణ్రెడ్డి తెలిపా రు. దీర్ఘకాలం లాభాలు వచ్చే ఆయిల్ ఫామ్ తోటల సాగుపై అవగాహన కల్పించి జిల్లా రైతులను ప్రోత్సహించారన్నారు. ఉద్యోగ విరమణ చేసినా జిల్లా రైతుల వ్యవసాయ క్షేత్రాల ను సందర్శిస్తూ సూచనలు, సలహాలు ఇస్తున్నారని తెలిపారు.త్వరగా కోలుకుని రైతులకు తన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇందులో డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి, సారంగాపూర్ మాజీ జెడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి ఉన్నారు.