● కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి
నిర్మల్చైన్గేట్: నిర్మల్ కలెక్టరేట్ పట్టణానికి దూరంగా ఉండడంతో పట్టణ ప్రజలతోపాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు, ఉద్యోగులు, అధికారులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాలచారి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శుక్రవారం మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన కలెక్టరేట్తో పడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా లేక నూతన కలెక్టరేట్ భవనం నిర్మల్లో అందరికీ అందుబాటులో ఉండేలా నిర్మించాడమా అనే విషయమై సీఎం రేవంత్రెడ్డితో మాట్లాడతానని తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జీల సహకారంతో రానున్న మూడున్నరేళ్లలో కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి జిల్లాలో బలోపేతం చేస్తానని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియ చేపడితే ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి బరిలో ఉంటానని స్పష్టం చేశారు. లేకపోతే అప్పటికి ఆదిలాబాద్ ఎంపీ స్థానం జనరల్ రిజర్వేషన్ అయితే ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.