భార్య మేయరైతే.. ఆనందాన్ని ఆపడం ఎవరితరం?

Rukmini Made Gowda Of JD(S) Elected As Mysuru Mayor - Sakshi

సాక్షి, మైసూరు: భార్యామణి మేయరైతే భర్త ఆనందానికి పట్టపగ్గాలుంటాయా!, ఆ ఆనందాన్ని దాచుకోకుండా ఉండడం ఎవరితరం? అందుకే భార్య మేయరైన మరుక్షణమే ఆమెను గాల్లోకి ఎత్తి సంతోషాన్ని చాటుకున్నాడు భర్త. బుధవారం కర్ణాటకలోని పర్యాటకనగరి మైసూరు మేయర్‌ పీఠానికి ఎన్నిక జరిగింది. కాంగ్రెస్‌–జేడీఎస్‌ కూటమి నుంచి పోటీ పడిన జేడీఎస్‌ కార్పొరేటర్‌ రుక్మిణి ఘన విజయం సాధించారు. దీంతో ఆమె భర్త విజయోత్సాహంతో పొంగిపోయారు. రుక్మిణిని ముద్దాడుతూ ఎత్తుకోవడంతో అందరూ ముసిముసిగా నవ్వుకున్నారు.

చదవండి: (కర్ణాటకలో మంకీ ఫీవర్‌.. తొలి కేసుగా నమోదు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top