Most Expensive Rakhi: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో.. | Sakshi
Sakshi News home page

Most Expensive Rakhi Surat: ఖరీదైన రాఖీ... వజ్రాలపై ‘ఓం’గుర్తు’తో..

Published Fri, Aug 12 2022 3:15 AM

Raksha Bandhan 2022: India's Most Expensive Rakhi Costs Rs. 5 Lakhs - Sakshi

ఇప్పుడెక్కడ చూసినా రాఖీ ముచ్చటే. గుజరాత్‌లోని సూరత్‌ మాత్రం ఇంకాస్త స్పెషల్‌. ఎందుకంటే... అక్కడంతా ఈ ఫొటోలో ఉన్న రాఖీ గురించే మాట్లాడుకుంటున్నారు. అందులో ఏముంది? అంటే. దాని విలువ. ఆ రాఖీ ఖరీదు ఐదు లక్షలు. బంగారంతో డిజైన్‌ చేసిన రాఖీ మధ్యలో వజ్రాలను పొదిగారు. ఆ వజ్రాలపై మళ్లీ ‘ఓం’గుర్తును పొందుపరిచారు. ప్రతి ఏటా వివిధ రకాల బంగారు, వెండి, ప్లాటినమ్‌ రాఖీలతో ఆకట్టుకునే ఆ షాప్‌ ఈసారి... వజ్రాలు పొదిగిన రాఖీని తయారు చేసింది.

సాధారణంగా రాఖీని రెండు, మూడు రోజుల తరువాత తీసేస్తారు. కానీ ఈ రాఖీని ఎప్పుడైనా ఆభరణంగా కూడా ధరించే వీలుందంటున్నాడు నగల షాప్‌ యజమాని దీపక్‌ భాయ్‌ చోక్సీ. అంతవిలువైన రాఖీని మీ అక్కనో, చెల్లెనో కడితే బాగుండేది అనుకుంటున్నారా.. అయితే అంతకంటే విలువైన గిఫ్ట్‌ను రెడీ చేసుకోవాల్సి ఉంటుంది మరి!  

Advertisement
Advertisement