వివక్షకు తావులేని వ్యవస్థ కావాలి: ప్రధాని | PM Narendra Modi inaugurates launch of Azadi Ke Amrit Mahotsav se Swarnim Bharat Ki Ore | Sakshi
Sakshi News home page

వివక్షకు తావులేని వ్యవస్థ కావాలి: ప్రధాని

Jan 21 2022 5:22 AM | Updated on Jan 21 2022 8:41 AM

PM Narendra Modi inaugurates launch of Azadi Ke Amrit Mahotsav se Swarnim Bharat Ki Ore - Sakshi

న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలు, ప్రగతి శీల నిర్ణయాలతో ఎలాంటి వివక్షలకు తావులేని వ్యవస్థ రూపుదిద్దుకుంటోందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ‘ఆజాదీ కె అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో గురువారం ‘స్వర్ణిమ్‌ భారత్‌ కే ఓర్‌’ ఆవిష్కరణ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ ప్రతిష్టను దిగజార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఎప్పటికప్పుడు దానిని ఎదుర్కొంటూ ప్రపంచం దృష్టిలో మన దేశ ముఖ చిత్రాన్ని మార్చాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా మహిళలను ఇంకా అంధకారంలోనే ఉంచిన కాలంలో మన దేశం మాత్రం దేవతల్లా పూజించిందని గుర్తు చేశారు.  ప్రతి భారతీయుని గుండెలో జ్ఞానజ్యోతిని వెలిగించాలని, అప్పుడే దేశం ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement