Last Ambassador Car Of Central Railways Mumbai Division Retired - Sakshi
Sakshi News home page

35 ఏళ్ల ప్రస్థానం.. కారు, డ్రైవర్‌కి ఒకేసారి వీడ్కోలు

Mar 31 2022 9:56 AM | Updated on Mar 31 2022 10:43 AM

Last Ambassador Car Of Central Railways Mumbai Division Retired - Sakshi

ముంబై సెంట్రల్‌: ఒకప్పుడు ధనవంతుల వా హనంగా, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహ నంగా ప్రసిద్ధి పొందిన అంబాసిడర్‌ కారుకు మధ్య రైల్వేకు చెందిన ముంబై విభాగం తుది వీడ్కోలు పలికింది. కారుతోపాటు ఆ కారును 35 సంవత్సరాలుగా నడిపిస్తున్న డ్రైవర్‌ కూడా ఉద్యోగం నుండి రిటైర్‌మెంట్‌ పొందారు. 35 సంవత్సరాలుగా మధ్య రైల్వేలో సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక అంబాసిడర్‌ వాహనాన్ని స్క్రాప్‌ చేయాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు.

కరీరోడ్‌ డిపోలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు.  సెంట్రల్‌ రైల్వే సేవలలో మిగిలిఉన్న ఒకేఒక్క ఈ అంబాసిడర్‌ కారు 1985, జనవరి 22న రైల్వే సేవల్లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి ఈ కారుకు డ్రైవర్‌గా ముత్తు పాండీ నాడార్‌ కొనసాగుతూ, కారుతో పాటే ఆయన కూడా మంగళవారం రిటైర్‌ కావడం విశేషంగా చెప్పుకోవాలి.

ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్‌ ఉంటేనే ప్రవేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement