'అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు.. రాబోయే రోజుల్లో చావులు మరింత పెరుగుతాయి'

Kodi Mutt Swamiji Prediction on Present Situation - Sakshi

హుబ్లీ: కార్తీకమాసం నుంచి ఉగాది వరకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తప్పవని ధార్వాడలో కోడి శ్రీ మఠం స్వామీజీ జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది చివరి వరకు, ఆ తర్వాత కూడా అశుభాలే ఉంటాయన్నారు. గాలి వానలు, భుకంపాలు, అగ్నిప్రమాదాలు, చావులు  వంటివి పెరుగుతాయన్నారు.

రోగాలతో జీవరాశులు మృత్యువాత పడుతాయన్నారు. రాజకీయ అస్థిరత ఉంటుందని, అన్ని పార్టీలు విడిపోయే లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. మూడు పార్టీల్లో చిలికలు తప్పవన్నారు.తాను ఏ వ్యక్తినీ ఉద్దేశించి చెప్పడం లేదని, తాను సన్యాసినని పేర్కొన్నారు.  వర్షాలు ఇలాగే కొనసాగుతాయని, రబీ పంటలు అన్నదాతకు చేతికందుతాయన్నారు.

చదవండి: (బీకాం విద్యార్థిని ఆత్మహత్య.. తల్లిదండ్రుల మాటలే..)  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top