China has built a village in Arunachal Pradesh: Pentagon - Sakshi
Sakshi News home page

అరుణాచల్‌ ప్రదేశ్‌లో గ్రామం.. ‘అది చైనాలోనే ఉంది’

Nov 10 2021 9:50 AM | Updated on Nov 10 2021 1:33 PM

India Raects To Pentagon Said Village in Arunachal Pradesh Located In China - Sakshi

అమెరికా ఇటీవల తన అంతర్గత నివేదికలో పేర్కొనడంపై భారత భద్రతా వర్గాలు ఒక స్పష్టతనిచ్చాయి

న్యూఢిల్లీ: చైనా ఒక గ్రామాన్ని ఏకంగా భారత భూభాగంలోనే నిర్మించి, అభివృద్ధి చేసిందంటూ అమెరికా ఇటీవల తన అంతర్గత నివేదికలో పేర్కొనడంపై భారత భద్రతా వర్గాలు ఒక స్పష్టతనిచ్చాయి. భారత్‌–చైనా సరిహద్దుల్లో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని వివాదాస్పద ప్రాంతంలో ఒక గ్రామం వెలిసింది. 

ఈ గ్రామం ఉన్న భూభాగం దాదాపు ఆరు దశాబ్దాలుగా చైనా అధీనంలోనే ఉందని భారత భద్రతా దళాల్లోని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘ఆ ప్రాంతంలోని భారత అస్సాం రైఫిల్స్‌ పోస్ట్‌ను 1959లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ ఆక్రమించుకుంది. దీనిని లాంగ్జూ ఘటనగా పేర్కొంటారు. అప్పటి నుంచీ ఆ ప్రాంతం చైనా ఆక్రమణలో ఉంది’ అని భారత సైనిక వర్గాలు తెలిపాయి.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement