ప్రజ్వల్‌ భారత్‌కు వచ్చి లొంగిపో: బాబాయ్‌ విజ్ఞప్తి | 'Return To India': HD Kumaraswamy Appeals To Nephew Prajwal Revanna | Sakshi
Sakshi News home page

ప్రజ్వల్‌ భారత్‌కు వచ్చి లొంగిపో: బాబాయ్‌ విజ్ఞప్తి

May 21 2024 11:08 AM | Updated on May 21 2024 11:24 AM

'Return To India': HD Kumaraswamy Appeals To Nephew Prajwal Revanna

బెంగళూరు: మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగిక దాడి ఆరోపణల కేసు కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపింది. ప్రజ్వల్‌కు సంబంధించినవిగా అసభ్య వీడియో వైరల్‌ అయ్యాయి. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. 

ఇక.. ఈ విషయంలో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజ్వల్‌ రేవణ్ణ జర్మనీ వెళ్లిపోయారు. అయితే ఆదివారం ప్రజ్వల్‌ రేవణ్ణ విషయంలో బాబాయ్‌ అయిన జేడీఎస్‌ చీఫ్‌ కుమారస్వామి స్పందించారు. విదేశంలో ఉన్న ప్రజ్వల్‌ రేవణ్ణ వెంటనే ఇండియాకు రావాలని కోరారు. లైంగిక ఆరోపణల కేసులో సిట్‌ ముందు దర్యాప్తు ఎదుర్కొవాలన్నారు. లేకపోతే ప్రజలు తమ కుటుంబాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారని తెలిపారు.

‘‘మీడియా ముఖంగా నేను ప్రజ్వల్‌ రేవణ్ణను ఇండియాకు రావాల్సిందిగా కోరుతున్నా. అతను ఏ దేశంలో ఉన్నా భయం లేకూడా భారత్‌ తిరిగి రావాలి. ఇంకా ఎంత కాలం ఇలా దాచుకొని తిరుగుతూ ఉంటావు?.  ప్రజ్వల్ రేవణ్ణకు తన తాత మాజీ ప్రధాని దేవెగౌడపై గౌరవం ఉంటే వెంటనే స్వదేశానికి తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపోవాలి. మన కుటుంబం గురించి ప్రజలు తప్పుగా అర్థం చేసుకోకుండా చూడాలి. 

...రెండు రోజుల్లో ప్రజ్వల్‌ పోలీసులకు లొంగిపోవాలి. లక్షల మంది పార్టీ కార్యకర్తలు నీకు ఓటు వేశారు.  ఇంకా ఎన్ని రోజులు ఇలా విదేశంలో ఉంటావు. దయచేసి ఇండియాకి తిరిగి వచ్చి అధికారులు ముందు హాజరుకావాలి. అప్పడే ఈ విషయంలో ఓ ముగింపు వస్తుంది. ఈ వ్యవహారంలో బాధితులకు నేను బహిరంగా క్షమాపణలు చేబుతున్నా. వారి బాధను నేను అర్థం చేసుకోగలను’’ అని కుమారస్వామి అన్నారు. ఇక.. అధికార కాంగ్రెస్‌ పార్టీ తన కుటుంబాన్ని అనేక సార్లు టార్గెట్‌ చేసిందని, కానీ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన ధైర్యంతో పోరాడుతున్నామని కుమారస్వామి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement