కరోనా: 24 గంటల్లో 524 మంది మృతి | Coronavirus Update India Records 44489 New Cases | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా 44,489 కరోనా కేసులు

Nov 26 2020 9:54 AM | Updated on Nov 26 2020 2:29 PM

Coronavirus Update India Records 44489 New Cases - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. 524 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 92,66,706కు చేరగా.. కోవిడ్‌ మరణాల సంఖ్య లక్షా ముప్పై ఐదువేలు(1,35,223) దాటింది. (చదవండి: విషాదం: కరోనాతో యువ వైద్యుడు మృతి)

ఇక ప్రస్తుతం దేశంలో 4,52,344 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇక గత ఇరవై నాలుగు గంటల్లో 36,367 మంది కోవిడ్‌ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 86,79,138కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement