పూణె: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు ముందు పుణెలోని ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ నిర్వహించనున్న ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమం నేపథ్యంలో శుక్రవారం సీవోఈపీ (సీఓఈపీ) టెక్నలాజికల్ యూనివర్సిటీ హాస్టల్ వద్ద అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు వర్సిటీ ప్రాంగణంలో భారీగా మోహరించారు.
राहुल गांधी जी की ऐतिहासिक Pune Rally के ठीक पहले Colleges और Hostels में जाकर ABVP के गुंडे बेटियों को धमका रहे है, बंधक बना रहे है उन्हें पीट रहे है,
लेकिन अब वो ये गलती करने की हिमाकत न करें, क्योंकि अब उन्ही की भाषा में जबाव देने के लिए कांग्रेस कार्यकर्ता तैयार है। pic.twitter.com/kmKtKSFWMc— Indian Youth Congress (@IYC) August 21, 2026
శనివారం జరగనున్న ‘ఛాత్రోం కీ గూంజ్’ కార్యక్రమంలో పాల్గొనేలా సీవోఈపీ విద్యార్థినులను ఎన్ఎస్యూఐ నాయకులు బలవంతంగా నమోదు చేయిస్తున్నారని ఏబీవీపీ ఆరోపించింది. ఏబీవీపీ నేత అథర్వ కులకర్ణి మాట్లాడుతూ.. ఎన్ఎస్యూఐ కార్యకర్తలు హాస్టల్ ప్రాంగణంలోకి ప్రవేశించి విద్యార్థులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు. మరోవైపు, ఈ ఆరోపణలను కాంగ్రెస్ వర్గాలు తీవ్రంగా ఖండించాయి. రాహుల్ గాంధీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ఇద్దరు విద్యార్థినులను హాస్టల్ గదిలో బంధించి ఏబీవీపీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ప్రత్యారోపణ చేశారు.
ఈ ఘటన అనంతరం హాస్టల్ను సందర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత విజయ్ వడెట్టివార్ మాట్లాడుతూ విద్యార్థినులపై ఏబీవీపీ కార్యకర్తలు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ మీడియా విభాగం అధ్యక్షుడు అక్షయ్ జైన్ మాట్లాడుతూ, ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని అన్నారు. స్కాలర్షిప్ సమస్యలపై గళమెత్తి, సభకు మద్దతు పలికినందుకే ఆ విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నారని ఆయన ఆరోపించారు. క్యాంపస్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: భారత్తో పోలిస్తే పాక్లో గూగుల్ ప్లాన్ ఎలా ఉంది?


