కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్తలు పాటించండి | Centre issues advisory to states over Covid protocols | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్తలు పాటించండి

Aug 13 2022 6:08 AM | Updated on Aug 13 2022 6:08 AM

Centre issues advisory to states over Covid protocols - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్‌ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నియమావళిని పాటించాలని కోరింది.

ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం                      చేపట్టాలని కూడా కోరింది.

Advertisement
 
Advertisement
Advertisement