అమిత్‌ షా టూర్‌ వేళ అపశృతి..పేలుడులో జవాన్‌కు గాయాలు | BSF Soldier Injured In IED Explosion In Chattisgarh Kanker | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా టూర్‌ వేళ అపశృతి..పేలుడులో జవాన్‌కు గాయాలు

Dec 15 2024 3:01 PM | Updated on Dec 15 2024 3:07 PM

BSF Soldier Injured In IED Explosion In Chattisgarh Kanker

రాయ్‌పూర్‌:కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం(డిసెంబర్‌15) ఛత్తీస్‌గఢ్‌ పర్యటన సందర్భంగా అపశృతి దొర్లింది. షా పర్యటనను పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్‌ కాంకేర్‌లో భద్రతా సిబ్బంది ముందస్తు తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఐఈడీని నిర్వీర్యం చేసే సమయంలో అది ఒక్కసారిగా పేలడంతో భద్రతా సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

దీంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత భద్రతా సిబ్బంది ఆ ప్రాంతంలో విస్త్రృత సోదాలు నిర్వహించారు. పేలుడు పదార్థాలతో తిరుగుతున్న తొమ్మిది మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. అమిత్‌ షా పర్యటన వేళ ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంకేర్‌లో హై అలర్ట్‌ ప్రకటించారు.

ఈ ప్రాంతంలో భద్రతా దళాలను భారీగా మోహరించినట్లు కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆదివారం రాయ్‌పుర్‌ చేరుకున్నారు. రాయ్‌పూర్,బస్తర్ జిల్లాల్లో జరిగే పలు కార్యక్రమాలకు ఆయన హాజరవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement