మరో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్‌ బోల్డ్‌ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? | Tollywood Romantic Thriller Movie Streaming In another Ott Platform | Sakshi
Sakshi News home page

Romantic Thriller Movie: టాలీవుడ్‌ బోల్డ్‌ మూవీ.. మరో ఓటీటీకి వచ్చేసింది

Jun 21 2024 3:14 PM | Updated on Jun 21 2024 6:53 PM

Tollywood Romantic Thriller Movie Streaming In another Ott Platform

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఓటీటీల హవా నడుస్తోంది. శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాలు క్యూ కడుతున్నాయి.  కొన్ని చిత్రాలు ఏకంగా నెల రోజుల్లోపే ఓటీటీలో దర్శనమిస్తున్నాయి.  తాజాగా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మాయలో చిత్రం మరో ఫ్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి వచ్చేసింది.  బోల్డ్ రొమాంటిక్ మూవీగా థియేటర్లలోకి వచ్చిన మాయలో చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో  న‌రేష్ అగ‌స్త్య, భావ‌న‌, జ్ఞానేశ్వ‌రి ప్రధాన పాత్రల్లో నటించారు. 

ఇప్పటికే మాయ‌లో మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.  తాజాగా శుక్రవారం నుంచి ఆహాలో అందుబాటులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఆడియన్స్‌ను  పెద్దగా ఆకట్టులేకపోయింది. ఈ చిత్రానికి  మేఘామిత్ర పేర్వార్ ద‌ర్శ‌క‌త్వం వహించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement