
జాన్ అబ్రహాం సరసన నటించనున్నారట తమన్నా. జాన్ అబ్రహాం హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఓ బయోగ్రాఫికల్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని హీరోయిన్ పాత్రకు మేకర్స్ తమన్నాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని బాలీవుడ్ సమాచారం. దివంగత ముంబై పోలీస్ కమిషనర్ రాజేశ్ మారియా జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రాకేశ్గా జాన్ అబ్రహాం నటిస్తున్నారు.
ఆయన భార్య ప్రీతి మారియాగా తమన్నా కనిపిస్తారట. ఈ ఏడాదే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాల నుకుంటున్నారు మేకర్స్. ఇక ఇప్పటికే అజయ్ దేవగన్ ‘రేంజర్’ చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు తమన్నా. అర్జున్ కపూర్–వరుణ్ధావన్ కలిసి నటించనున్న హిందీ చిత్రం ‘నో ఎంట్రీ 2’లో తమన్నాకు చాన్స్ లభించిందనే టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు రాజేశ్ మారియా బయోగ్రాఫికల్ డ్రామాలో చాన్స్ వచ్చిందని టాక్. ఇంకా అజయ్ దేవగన్ ‘రైడ్ 2’లో తమన్నా ‘నిషా’ అనే స్పెషల్ సాంగ్ చేశారు. చూస్తుంటే... ఇలా వరుస అవకాశాలతో తమన్నా హిందీలో బిజీ బిజీగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక తెలుగులో తమన్నా లీడ్ రోల్లో నటించిన ‘ఓదెల 2’ ఈ నెల 17న విడుదలైంది.